టాక్సీలో బాలుడిని మర్చిపోయిన తల్లిదండ్రులు
మనం టాక్సీలు, ఆటోలు, బస్సుల్లో ప్రయాణించినపుడు సాధారణంగా తాళాలు.. మొబైల్స్.. బ్యాగులు తదితర వస్తువులను మర్చిపోయి వాటి నుంచి దిగుతుంటాం. కొద్ది సేపటికి వాటిని మరిచిపోయినట్లు తెలిసి విలువ ఉన్నది పోతే బాధపడతాం. వాటిని తిరిగి పొందగలిగే అవకాశం ఉంటే
కోల్కతా: టాక్సీలు, ఆటోలు, బస్సుల్లో ప్రయాణించినప్పుడు సాధారణంగా తాళాలు.. మొబైల్స్.. బ్యాగులు తదితర వస్తువులను మర్చిపోతాం. కొద్దిసేపటికి ఆ వస్తువుల గురించి గుర్తు రాగానే, కంగారుపడతాం. వీలైతే వాటిని ఎలా తిరిగి తెచ్చుకోవాలో ప్రయత్నిస్తాం. అయితే కోల్కతా విమానాశ్రయంలో మంగళవారం సాయంత్రం ఓ కుటుంబం టాక్సీలో ఆరేళ్ల బాలుడిని మరిచిపోయి వెళ్లిన ఆశ్చర్యపోయే ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. లఖ్నవూ చేరుకోవడానికి ఓ కుటుంబం కోల్కతా విమానాశ్రయానికి చేరుకుంది. కారులో నుంచి లగేజీ దించటం, విమానం బయలుదేరే సమయం దగ్గరపడటంతో తల్లిదండ్రులు కారులో నిద్రిస్తున్న ఆరేళ్ల చిన్నారిని మరిచిపోయారు. లగేజీతో పాటు విమానంలో లఖ్నవూకు వెళ్లడంతో పాటు వాళ్లతో ఆరేళ్ల చిన్నారి లేడని గుర్తించకుండా ఇంటికి సైతం చేరుకున్నారు. తీరా ఇంటికి వచ్చాక బాలుడు ఏమయ్యాడోనని ఆరా తీయగా టాక్సీ వెనుక సీటులో అలాగే వదిలేసి వచ్చినట్లు గుర్తొచ్చింది.
టాక్సీ బిల్లుపై ఉన్న ఫోన్ నెంబరు ఆధారంగా వాళ్లు వెంటనే కోల్కతాలోని ట్రాఫిక్ పోలీసులను సంప్రదించారు. తమ కొడుకుని టాక్సీలో మర్చిపోయి ఇంటికి వచ్చినట్లు చెప్పిన తల్లిదండ్రులు చిన్నారిని కాపాడాలని కోరారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు విమానాశ్రయ అధికారులను సంప్రదించి అక్కడ నమోదైన టాక్సీ నెంబర్ ఆధారంగా డ్రైవరుతో ఫోన్కాల్లో మాట్లాడారు. కారు వెనుక సీటులో చిన్నారి నిద్రిస్తున్నాడేమో చూడమని పోలీసులు చెప్పగా అప్పటికీ ఆ బాలుడు నిద్రలోనే ఉండటం చూసి డ్రైవరు ఆశ్చర్యపోయాడు. తన 14 ఏళ్ల డ్రైవర్ వృత్తిలో ఇలా పిల్లాడిని వదిలి వెళ్లిన దంపతులను చూడలేదని అతను పేర్కొన్నాడు. అనంతరం ఆ డ్రైవరు బాలుడిని విమానాశ్రయ అధికారుల వద్దకు చేర్చారు. చిన్నారి తల్లిదండ్రులను పిలిపించిన అధికారులు బాలుడిని వారికి అప్పగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు