కరోనా.. గర్భిణీకి వైద్యం అందించడానికి నిరాకరణ
కశ్మీర్లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన మహిళ కాన్పు కోసం అక్కడి బందీపొర జిల్లాలో ఉన్న ఆసుపత్రిలో చేరారు. మహిళకు కొంతసేపటికి పురిటినొప్పులు రావడంతో వైద్యం చేయడానికి కరోనాతో పాటు కొన్ని పరీక్షలు చేయించమని ఆమె కుటుంబ సభ్యులకు
ఆసుపత్రి గేటు వద్ద ప్రసవించిన మహిళ
జమ్మూకశ్మీర్ : కశ్మీర్లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన మహిళ కాన్పు కోసం అక్కడి బందీపొర జిల్లాలో ఉన్న ఒక ఆసుపత్రిలో చేరారు. మహిళకు కొంతసేపటికి పురిటినొప్పులు రావడంతో వైద్యం చేయడానికి కరోనాతో పాటు కొన్ని పరీక్షలు చేయించమని ఆమె కుటుంబ సభ్యులకు వైద్యులు సూచించారు. ఈ క్రమంలో ఆ మహిళకు కరోనా పాజిటివ్గా నిర్ధరణ అయింది. దీంతో గర్భిణీకి వైద్యసేవలు అందించడానికి నిరాకరించిన వైద్యులు అక్కడికి 25 కిమీ దూరంలో ఉన్న మరో ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ఆమె బంధువులు మహిళను వైద్యులు సూచించిన ఆసుప్రతికి తీసుకెళ్లే సమయంలో పురిటినొప్పులు తీవ్రంగా వచ్చాయి.
ఆసుపత్రి గేటు సమీపంలో మహిళ తీవ్రనొప్పులతో బాధపడుతుండటంతో అక్కడ ఉన్న కొందరు మహిళలు దుప్పట్లు తీసుకొచ్చి పురిటినొప్పులతో అల్లాడుతున్న మహిళ చుట్టూ ఉంచారు. కొద్దిసేపటికి మహిళ ప్రసవించారు. గర్భంతో ఉన్న మహిళ అంత బాధపడుతున్నా ఒక్క వైద్యుడు కూడా వైద్యం అందించడానికి ముందుకు రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్యులకు వ్యతిరేకంగా పలువురు నిరసన తెలిపారు. దీంతో స్పందించిన సంబంధిత అధికారి ఆసుపత్రి వైద్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమానవీయంగా ప్రవర్తించిన వైద్యులపై కఠిన చర్యలకు ఆదేశించినట్లు ఆయన వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డులు, కొత్త కస్టమర్లు చేర్చుకోవడంపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!
-
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్
-
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ