హైదరాబాద్లో స్వల్ప భూ ప్రకంపనలు!
హైదరాబాద్లో స్వల్పంగా భూ ప్రకంపనలు ప్రజలను భయాందోళనకు గురి చేశాయి. జూబ్లీహిల్స్ పరిధిలోని పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. శుక్రవారం రాత్రి 8.15 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య దాదాపు 12 సార్లు భూమి కంపించింది. భయాందోళనకు గురైన స్థానికులు..
అమీర్పేట: హైదరాబాద్లో స్వల్పంగా భూ ప్రకంపనలు ప్రజలను భయాందోళనకు గురి చేశాయి. జూబ్లీహిల్స్ పరిధిలోని పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. శుక్రవారం రాత్రి 8.15 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య దాదాపు 12 సార్లు భూమి కంపించింది. భయాందోళనకు గురైన స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. జూబ్లీహిల్స్ పరిధిలోని బొరబండ సైట్-3, ఎఫ్సీఆర్ హిల్స్, జూబ్లీహిల్స్, రహమత్ నగర్ ప్రాంతాల్లో భూమి కంపించింది. రాత్రి 9 గంటల తర్వాత భూప్రకంపనలు ఆగిపోవడంతో ప్రజలు వారి ఇళ్లకు వెళ్లిపోయారు. అనంతరం రాత్రి 11 గంటల ప్రాంతంలో బొరబండ, అల్లాపూర్, ఎర్రగడ్డ ప్రాంతాల్లో మరోసారి భూ ప్రకంపనలు వచ్చాయి. దాదాపు 5 సెకన్ల పాటు భూమి కంపించింది. భూ ప్రకంపనల భయంతో స్థానికులు ఇళ్ల నుంచి మరోసారి పరుగులు తీశారు. వరుస భూప్రకంపనలతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దీనిపై హైదరాబాద్ డిప్యూటీ మేయర్ స్పందించారు. వదంతులు నమ్మొద్దంటూ ఆయన ప్రచారం చేయడం గమనార్హం. భూకంప తీవ్రతపై అధికారులు స్పందించాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు