ఈ ‘గజ’దొంగపై చర్యల్లేవు..
పట్ట పగలు, నడి రోడ్డు మీదే బస్సును ఆపి చోరీ చేసిన ఓ ‘గజ’దొంగపై.. ఏ పోలీసులూ చర్య తీసుకోలేదు.
ఇంటర్నెట్ డెస్క్: పట్ట పగలు, నడి రోడ్డు మీదే బస్సును ఆపి చోరీ చేసిన ఓ ‘గజ’దొంగపై.. ఏ పోలీసులూ చర్య తీసుకోలేదు. ఎందుకంటే ఆ దొంగతనం చేసింది ఓ ఏనుగు కాబట్టి! కాగా, ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను ఓ అటవీశాఖ అధికారి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.
ఈ ఆసక్తికర వీడియో శ్రీలంకలోని కాటరంగమ ప్రాంతంలో చోటుచేసుకుంది. దీనిలో.. రోడ్డు మధ్యలో ఓ ఏనుగు నిలిచి ఉండటంతో బస్సు డ్రైవరు వాహనాన్ని స్లో చేశాడు. బస్సు తన పక్కకు వచ్చిన అనంతరం ఏనుగు తన తొండాన్ని కిటికీ లోంచి లోపలికి పెట్టి.. అక్కడ ఉన్న ఆహారాన్ని అందిపుచ్చుకునేందుకు ప్రయత్నించింది. ఈయత్నంలో ఆ ఏనుగు అక్కడ ఉన్న అరటిపళ్లను దొరికించుకుంది. ఆ విధంగా ఏనుగుకు ‘టోల్ టాక్స్’ చెల్లించిన డ్రైవరు బతుకు జీవుడా అంటూ బస్సును ముందుకు పోనిచ్చాడు.
ఇక ఈ సంఘటనకు బస్సులోని ప్రయాణికుల్లో కొందరు ఆశ్చర్యంతో షాక్ తినగా.. మరికొందరు గట్టిగా నవ్వడాన్ని మనం గమనించవచ్చు. కాగా, అడవి జంతువులకు ఆహార పదార్ధాలను తినిపించడం సరికాదని అటవీ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆ విధంగా చేస్తే ఆ జంతువులు అలవాటుపడి.. మనుషులు, వాహనాల సమీపానికి వచ్చేస్తూ ఉంటాయని.. అది వాటికీ, మనుషులకూ కూడా క్షేమం కాదని వారు అంటున్నారు. మరి ఈ గజదొంగను మీరూ చూసేయండి!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు