మాస్క్లు అతిగా వాడితే ప్రమాదమా?
కరోనా కారణంగా మాస్క్లేనిదే బయటకు రాలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయి. మాస్క్లు అతిగా వాడటం వల్ల కలిగే ఇబ్బందులు
హూస్టన్: కరోనా కారణంగా మాస్క్లేనిదే బయటకు రాలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయి. మాస్క్లు అతిగా వాడటం వల్ల కలిగే ఇబ్బందులు ఇవేనంటూ కొన్ని వార్తలు సామాజిక మాధ్యమాల్లోనూ చక్కర్లు కొడుతున్నాయి. మాస్క్ల కారణంగా కార్బన్డయాక్సైడ్ స్థాయులు పెరిగి, ఊపిరితిత్తుల సమస్యకు దారితీస్తుందని ప్రచారం చేస్తున్నారు. తాజా అధ్యయనమొకటి ఈ వార్తలను ఖండించింది. మరీ ముఖ్యంగా మాస్క్ల వినియోగం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని తెలిపింది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మియామీ ఈ విషయమై అధ్యయనం చేసింది.
మాస్క్లు ధరించడం వల్ల ఆరోగ్యవంతులైన వ్యక్తుల్లో ఆక్సిజన్, కార్బన్డయాక్సైడ్ స్థాయుల్లో మార్పులు జరిగి అనారోగ్యం పాలవుతారన్న వార్తల్లో నిజం లేదని తెలిపింది. అయితే, అందరిలోనూ అలా జరగకపోవచ్చని ముఖ్యంగా క్రానిక్ అబ్స్ట్రాక్టివ్ పల్మనరీ డీసీజ్(సీఓపీడీ)తో బాధపడేవారిలో ఈ సమస్య ఎదురుకావొచ్చని ఈ అధ్యయనం పేర్కొంది. ఎందుకంటే సీఓపీడీ సమస్య ఉన్న వాళ్లు ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. ‘మాస్క్ ధరించడం వల్ల అతి తక్కువ మంది మాత్రమే ఇబ్బందులు ఎదుర్కొంటారు. అదీ కూడా తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్య ఉన్నవారికి ఇది ఇంకాస్త ఎక్కువగా ఉండవచ్చు’ అని అధ్యయన కర్తల్లో ఒకరైన మైఖేల్ కాంపోస్ తెలిపారు.
సౌకర్యవంతమైన, గాలి పీల్చుకునేందుకు వీలైన మాస్క్లు ధరించడం వల్ల ఎలాంటి సమస్య ఉండదని, అయితే, మాస్క్లను బిగుతుగా ధరించడం, వేగంగా నడవడం వల్ల శ్వాస ఆడక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఇతరులకు దూరంగా ఉన్నప్పుడు మాస్క్ను తొలగించవచ్చని కాంపోస్ చెప్పారు. అయితే, అదే సమయంలో కరోనాను అడ్డుకట్టవేయడంలో మాస్క్ ధరించడం తప్పనిసరి అని కూడా అన్నారు. సర్జికల్ మాస్క్లు ధరించలేని వారు రెండు పొరలతో కూడిన క్లాత్ మాస్క్ ధరించాలని అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సూచించిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్
హైదరాబాద్ నగర శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. -
సైబర్ టవర్స్ వద్ద చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను హైదరాబాద్లో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. -
చంద్రబాబుకు ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు
తెదేపా అధినేత చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దుర్గారావును చూపించాలంటూ ఆందోళన.. సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
నగరంలోని సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీపీ కాంతి రాణాను కలిసేందుకు వడ్డెర కుల సంఘం నేతలు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు. -
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు
తాజా వార్తలు (Latest News)
-
పాకిస్థాన్కు ‘క్షిపణి’ సాయం.. చైనా సంస్థలపై అగ్రరాజ్యం ఆంక్షల కొరడా!
-
పవన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.. పిఠాపురంలో నేతల సంకల్పం
-
భారత విద్యార్థి మృతి.. మరోసారి చర్చలోకి బ్లూవేల్ ఛాలెంజ్..!
-
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్
-
ఈ పోలింగ్ ‘బ్యూటీ’ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ ఈశా అరోడా..?
-
ఆ సినిమా నుంచి గుణపాఠం నేర్చుకున్నా: సోనాలి బింద్రే