పట్టాలెక్కనున్న మరికొన్ని రైళ్లు 

కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన రైలు సర్వీసులను రైల్వే శాఖ విడతల వారీగా పునరుద్ధరిస్తోంది. తాజాగా మరికొన్ని రైళ్లను పట్టాలు ఎక్కించనున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు నడుస్తున్న రైలు సర్వీసులకు అదనంగా మరో 39 రైళ్లను నడిపేందుకు అన్ని రైల్వే జోన్లకు అనుమతిచ్చినట్లు తెలిపింది. వాటిలో..

Published : 07 Oct 2020 18:26 IST

దిల్లీ: కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన రైలు సర్వీసులను రైల్వే శాఖ విడతల వారీగా పునరుద్ధరిస్తోంది. తాజాగా మరికొన్ని రైళ్లను పట్టాలు ఎక్కించనున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు నడుస్తున్న రైలు సర్వీసులకు అదనంగా మరో 39 రైళ్లను నడిపేందుకు అన్ని రైల్వే జోన్లకు అనుమతిచ్చినట్లు తెలిపింది. వాటిలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 4 మార్గాల్లో రైళ్లకు అనుమతులు లభించాయి. సికింద్రాబాద్‌-శాలిమార్, లింగంపల్లి-కాకినాడ టౌన్, విశాఖ-తిరుపతి, సికింద్రాబాద్‌-విశాఖ సర్వీసులు ప్రారంభించేందుకు రైల్వే శాఖ అవకాశం కల్పించింది. అనుమతి ఇచ్చిన రైళ్లను ప్రత్యేక సర్వీసులుగా నడపనున్నట్లు రైల్వే శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని