ఓటు బాధ్యతనుకున్నారు.. వంతెన నిర్మించుకున్నారు!
బిహార్లో ఎన్నికల వేళ ఓ గ్రామానికి చెందిన ప్రజలు ఓటింగ్పై తమ బాధ్యతను చాటుకున్నారు. పోలింగ్ కేంద్రానికి వెళ్లేందుకు వాగు ఆటంకిగా మారడంతో ఏకంగా వంతెననే నిర్మించి ఆశ్చర్యపరిచారు. మొదటి దశ ముందు రోజున నిర్మాణం ప్రారంభించి మూడో దశ ఎన్నికలకు ఒక్కరోజు ముందే పూర్తి చేసి
పట్నా: బిహార్లో ఎన్నికల వేళ ఓ గ్రామానికి చెందిన ప్రజలు ఓటింగ్పై తమ బాధ్యతను చాటుకున్నారు. పోలింగ్ కేంద్రానికి వెళ్లేందుకు వాగు ఆటంకిగా మారడంతో ఏకంగా వంతెననే నిర్మించి ఆశ్చర్యపరిచారు. మొదటి దశ ముందు రోజున నిర్మాణం ప్రారంభించి మూడో దశ ఎన్నికలకు ఒక్కరోజు ముందే పూర్తి చేసి.. వంతెనపై వెళ్లి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కాగా ఈ వంతెనకు సంబంధించిన విషయాల్ని స్థానికుడు పర్వేజ్ ఆలం అనే వ్యక్తి మీడియాకు వెల్లడించారు. ‘ఎన్నో ఏళ్లుగా ఈ వాగు దాటడానికి కష్టాలు పడుతున్నాం. ఇప్పటి వరకు ఎవరూ కనీసం వంతెన నిర్మాణం గురించి పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఎన్నికల వేళ పోలింగ్ కేంద్రం వాగు అవతలివైపు ఉండటంతో ప్రజలు సులభంగా వెళ్లడానికి ఈ మార్గం ఆలోచించాం. దీంతో ప్రజలు గరిష్ఠ సంఖ్యలో వంతెనపై నడుచుకుంటూ వెళ్లి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ వంతెన నిర్మాణం మొదటి దశ ఎన్నికలకు ఒకరోజు ముందు(అక్టోబర్ 27)న ప్రారంభించాం. అది కాస్తా తమ ప్రాంత ఎన్నికలకు ఒకరోజు ముందు నవంబర్ 6న పూర్తయింది’ ఆలం తెలిపారు. ఈ వంతెన లేకపోతే ప్రజలు పడవలను ఉపయోగించుకుని వాగు దాటాల్సి వచ్చేదని చెప్పారు.
బిహార్లో శనివారం మూడో దశ ఎన్నికల నిర్వహణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. మధ్యాహ్నం మూడు గంటల సమయానికి 42శాతం నమోదైందని ఎన్నికల సంఘం వెల్లడించింది. తుది దశలో మొత్తం 16 జిల్లాల్లోని 78 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు కొనసాగుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం జరిగింది. -
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేశ్ బాబు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్