రూ.20 కోసం కొట్లాట.. ఒకరు మృతి
ముగ్గురి మధ్య రూ.20 కోసం జరిగిన వాగ్వాదం ఒకరి ప్రాణాలను బలి తీసుకుంది. దేశ రాజధానిలో ఈ ఘటన చోటు చేసుకుంది. దిల్లీలోని బురారీ ప్రాంతంలో నివాసం ఉండే రూపేశ్ అనే వ్యక్తి స్థానికంగా ఉండే బార్బర్ దుకాణానికి
న్యూదిల్లీ : ముగ్గురి మధ్య రూ.20 కోసం జరిగిన కొట్లాట ఒకరి ప్రాణాలను బలి తీసుకుంది. దేశ రాజధానిలో ఈ ఘటన చోటు చేసుకుంది. దిల్లీలోని బురారీ ప్రాంతంలో నివాసం ఉండే రూపేశ్ అనే వ్యక్తి స్థానికంగా ఉండే బార్బర్ దుకాణానికి క్షవరం చేయించుకోడానికి వెళ్లారు. క్షవరం చేసిన వ్యక్తి రూపేశ్ను రూ.50 ఇవ్వమని అడిగారు. రూపేశ్ రూ.30 ఇచ్చి మిగతాది తర్వాత ఇస్తానని అన్నారు. మిగతా రూ. 20 కూడా వెంటనే ఇవ్వాలని క్షవరం చేసిన సంతోష్ అతని సోదరుడు సరోజ్ రూపేశ్తో వాగ్వాదానికి దిగారు. అది పెద్ద ఘర్షణకు దారి తీసి ఇద్దరు సోదరులు రూపేశ్ను కర్రలతో కొట్టారు. తీవ్రగాయాలతో ఆసుప్రతికి వెళ్లిన బాధితుడు చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటన ఈ నెల 24న జరిగిందని తమకు సోమవారం అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
-
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
-
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్
-
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?
-
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!