జవాబులు కావాలి..

ప్రజలకు కరోనా వాక్సిన్‌ పంపిణీపై ఉన్న సందేహాలను కేంద్ర ప్రభుత్వం తీర్చాలని కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. సోమవారం ఈ మేరకు కేంద్రానికి నాలుగు ప్రశ్నలు సంధించారు.

Updated : 24 Nov 2020 04:58 IST

 వాక్సిన్‌పై ప్రజలకున్న సందేహాలు తీర్చాలి
 ప్రధానికి ప్రశ్నలు సంధించిన రాహుల్‌

దిల్లీ: ప్రజలకు కరోనా వాక్సిన్‌ పంపిణీపై ఉన్న సందేహాలను కేంద్ర ప్రభుత్వం తీర్చాలని కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ డిమాండ్‌ చేశారు. సోమవారం ఈ మేరకు కేంద్రానికి నాలుగు ప్రశ్నలు సంధించారు. దేశ ప్రజలందరి మదిలో ఉన్న ఈ ప్రశ్నలకు ప్రధాని సమాధానం ఇచ్చితీరాలన్నారు.  ఈ మేరకు ట్విటర్‌లో ప్రశ్నలు కురిపించారు. ఆ ప్రశ్నలు ఏంటంటే..
1. వాక్సిన్‌ వచ్చిన తర్వాత ఎవరికి ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందా?? నిర్ణయిస్తే ఎందుకు వారినే ఎంచుకుంటారు??
2. వాక్సిన్‌ ముందుగా ఎవరికి ఇస్తారు? అసలు పంపిణీ ప్రక్రియ ఏ విధంగా ఉండబోతోంది?
3. పీఎం కేర్స్‌ నిధులను ఉపయోగించి ప్రజలందరికీ వాక్సిన్‌ ఉచితంగా అందిస్తారా??
4. వాక్సిన్‌ను దేశప్రజలందరికీ ఎప్పటిలోగా అందిస్తారు?? 

ముందు జాగ్రత్త లేకుండా కేంద్రం లాక్‌డౌన్‌ను విధించడంతో అనేక మంది ఆకలితో అలమటించారని రాహుల్‌ ఆదివారం ట్వీట్‌ చేశారు.  మంగళవారం ప్రధాని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో రాహుల్‌ అడిగిన ఈ ప్రశ్నలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని