కవిత కాపీ విషయంలో సీఎంపై ట్రోల్స్
మధ్యప్రదేశ్ సీఎంపై సామాజిక మాధ్యమాల్లో ఓ కవిత విషయంలో విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. గత నెల సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ ట్వీట్ చేసిన ఓ కవిత నెట్టింట్లో వైరల్గా మారింది. నవంబరులో ఆయన మామ(భార్య తండ్రి) మృతి
భోపాల్ : మధ్యప్రదేశ్ సీఎంపై సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. గత నెల సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ ట్వీట్ చేసిన ఓ కవితను కాపీ చేసినట్లు విమర్శలు గుప్పిస్తున్నారు. నవంబరులో ఆయన మామ మృతి చెందారు. ఆ సమయంలో ఆయన భార్య సాధనా సింగ్ తన తండ్రిపై రాసినట్లు కవితను ఆమె ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపులో షేర్ చేశారు. తండ్రిని గుర్తు చేసుకుంటూ తన భార్య రాసిన కవిత అని వివరిస్తూ దాన్ని నవంబరు 22న సీఎం ట్వీట్ చేశారు.
కవితపై గొడవేంటంటే..
‘కవిత రాసింది నేను.. మీ భార్య కాదు’ అని మధ్యప్రదేశ్కు చెందిన భూమిక అనే మహిళ మంగళవారం సీఎం ట్వీట్కు రీట్వీట్ చేశారు. గత నెల 21న తన తండ్రి మరణించడంతో ఆయనకు నివాళులు తెలుపుతూ కవిత రాసినట్లు ఆమె తెలిపారు. దాన్ని ఫేస్బుక్లో పోస్టు చేసినట్లు వివరించారు. తన తండ్రి అంతిమ సంస్కారాల సమయంలోనే ఫోన్లోని నోట్ప్యాడ్లో దాన్ని రాసినట్లు వివరించారు. అప్పుడే దాన్ని తన ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపులో కూడా షేర్ చేసినట్లు తెలిపారు. ఆ కవితను సీఎం భార్య తనదిగా వాట్సాప్లో షేర్ చేసినట్లు భూమికకు ఆమె స్నేహితురాలు స్క్రీన్షాట్ పంపారు. దీనిపై భూమిక తొలుత పెద్దగా పట్టించుకోలేదు. అనంతరం సీఎం శివరాజ్సింగ్ చౌహన్ కవితను ట్వీట్ చేయడం.. ఆయన భార్య తన తండ్రికి గుర్తుగా ఇది రాసిందనడంతో భూమిక స్పందించారు.
తనకు సీఎం అంటే గౌరవం అని తెలిపిన భూమిక.. ఈ విషయాన్ని రాజకీయం చేయాలనుకోవడం లేదని వివరించారు. కవిత రాసిన తనకే ఆ గౌరవం దక్కాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. కవిత కాపీపై ఆ రాష్ర్ట కాంగ్రెస్ సీనియర్ నేత అరుణ్ యాదవ్ సీఎంపై విమర్శలకు దిగారు. వేరే వాళ్లు చేసిన పనులకు పేర్లు మార్చి తమదని నమ్మించడం భాజపాకు అలవాటే అని ట్వీట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు: అనసూయ
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM