ఇన్స్టాగ్రామ్.. 4గంటలు.. ప్రపంచ రికార్డు
దిగ్గజ ప్రసారకర్త సర్ డేవిడ్ అట్టెన్బొరో ఓ అరుదైన ఘనత సాధించారు..
అరుదైన ఘనత సాధించిన దిగ్గజ ప్రసారకర్త
ఇంటర్నెట్ డెస్క్: దిగ్గజ ప్రసారకర్త సర్ డేవిడ్ అట్టెన్బొరో ఓ అరుదైన ఘనత సాధించారు. ఇన్స్టాగ్రామ్లో అత్యంత వేగంగా మిలియన్ ఫాలోవర్లను సంపాదించుకొని ప్రపంచ రికార్డు సృష్టించారు. ప్రకృతి ప్రేమికుడైన బ్రిటన్కు చెందిన అట్టెన్బొరో గురువారం మొట్టమొదటిసారి ఇన్స్టాగ్రామ్లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ప్రపంచం ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని మనమందరం ఏకమై భూగోళాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ‘ఖండాలు అగ్ని గుండాల్లా మారాయి. మంచుకొండలు కరిగిపోతున్నాయి. పగడపు దిబ్బలు కనుమరుగవుతున్నాయి. సముద్ర జీవులు అంతరించిపోతున్నాయి. ఈ జాబితా ఇంకా చాలా పెద్దగా ఉంది. ఈ భూగోళాన్ని కాపాడుకోవడం ఇప్పుడు మనముందున్న అతి పెద్ద సవాలు. ఇందుకోసం ఏం చేయాలో మనకు తెలుసు. అందుకు ముందడుగు వేయాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రస్తుతం ఉన్న అవరోధాలు, వాటిని ఎదుర్కొనేందుకు చేయాల్సిన పనులను వీడియోల ద్వారా తెలియజేస్తాను. కొన్ని ఎక్స్క్లూజివ్ వీడియోలను పంచుకుంటాను. అందుకే నేను ఈ మాధ్యమంలోకి వచ్చాను. ఈ వీడియోలను షేర్ చేద్దాం.. సమాజంలో మార్పునకు నడుం బిగిద్దాం. అంటూ మొదటి వీడియో పోస్టు చేశారు.
డేవిడ్ అట్టెన్బొరో ఇన్స్టాగ్రామ్లోకి వచ్చిన నాలుగు గంటల్లోనే మిలియన్ ఫాలోవర్లను సంపాదించుకొని గిన్నిస్ రికార్డు సృష్టించారు. ఈ విషయాన్ని గిన్నిస్ రికార్డు అధికారులు ధ్రువీకరించారు. గతంలో నటి జెన్నిఫర్ అనిస్టన్ పేరిట ఉన్న రికార్డును అట్టెన్బొరో బద్దలు కొట్టారు. కాగా ఆ వీడియోను ఇప్పటివరకు 14 మిలియన్ల మంది వీక్షించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం