ప్రేమలో మోసపోయారా?.. ఈ టీ మీకోసమే!
మరి మనసు గాయపడినపుడు తాగే ప్రత్యేక టీ గురించి మీరెపుడైనా విన్నారా?
ఇంటర్నెట్ డెస్క్: టీ అనేది కేవలం ఓ పానీయం అనేది మామూలు ప్రజల అభిప్రాయం. దాని అభిమానులకైతే అది ఓ భావావేశం. పని ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం లభించాలన్నా.. స్నేహితులతో సరదా కబుర్లకైనా.. ఇంటికొచ్చిన అతిధులకు అందించాలన్నా తేనీరే మంచి ఎంపిక. ఇక టీ తాగటంతోనే మూడ్ పూర్తిగా మారిపోతుందని చాలామంది అంటారు. మరి మనసు గాయపడినపుడు తాగే ప్రత్యేక టీ గురించి మీరెపుడైనా విన్నారా?మధ్యప్రదేశ్ గ్వాలియర్ పట్టణం హనుమాన్ నగర్కు చెందిన ‘కాలూ బేవఫా’ అనే ఈ టీ స్టాల్ పేరే కాదు.. ఇక ఇక్కడ లభించే చాయ్ కూడా చిత్రవిచిత్రమైన పేర్లతో ఆసక్తికరంగా ఉంటాయి. తమ వద్ద ప్రతి మూడ్కీ తగిన చాయ్ లభిస్తుందని దీని యజమానులు భరోసా ఇస్తుంటారు. అవేంటంటే..
ప్రేమలో దెబ్బతిన్న వారి కోసం ఉద్దేశించిన ‘ప్యార్ మే ధోకా’ గీ ఖరీదు రూ.5 కాగా.. ఒంటరితనంలో తాగాల్సిన ‘అకేలాపన్’ టీ వెల రూ.20. అయితే అంతా విషాదమే కాకుండా ఆనందంగా ఉన్న జంటలకు సరిపడే తేనీరు కూడా ఇక్కడ లభిస్తుందట. ఉదాహరణకు ఇక్కడ రూ. 10 కి లభించే ‘నయే ప్రేమీ కీ చాయ్’ కొత్తగా ప్రేమలో పడ్డవారికోసమైతే.. ఇష్టమైన వారి ప్రేమ పొందేందుకు ఉపయోగపడే ‘మన్ చాహా ప్యార్ పానే కీ చాయ్’ ఖరీదు అన్నిటికంటే అధికంగా రూ.49గా ఉంది.
మరి ఇక్కడ ఒక రకమైన టీ మాత్రం పూర్తి ఉచితంగా లభిస్తుందట.. మరి అదెవరికంటే భార్యాబాధితులకి అంటూ నవ్వేస్తున్నారు. కాగా, వినియోగదారులను ఆకర్షించేందుకు వెరైటీ ఆలోచనతో ముందుకొచ్చిన ఈ టీ దుకాణంలో వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతోందనటంలో ఏ సందేహం లేదు!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల