వందేభారత్ ద్వారా 39 లక్షల మంది స్వదేశానికి..
ఈ ఏడాది మేలో వందేభారత్ మిషన్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 39లక్షల మందిని సురక్షితంగా స్వదేశానికి రప్పించినట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి తెలిపారు.
దిల్లీ: ఈ ఏడాది మేలో వందేభారత్ మిషన్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 39లక్షల మందిని సురక్షితంగా స్వదేశానికి రప్పించినట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో ప్రకటించారు. కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు వందేభారత్మిషన్ను కేంద్రం ప్రారంభించింది. డిసెంబరు 18 శుక్రవారం నాడు 8,546 మంది భారత్కు వచ్చినట్లు మంత్రి ఆ ట్వీట్లో పేర్కొన్నారు. డిసెంబరు 1 నుంచి ఈ మిషన్ ఫేజ్-8 ప్రారంభించిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ తెలిపారు. దీనిలో భాగంగా లక్షాయాభైవేల మందిని స్వదేశానికి రప్పించనున్నట్లు వారు తెలిపారు. మే 25 నుంచి భారత్లో దేశీయ విమాన సర్వీసులను ప్రారంభించిన కేంద్రం అంతర్జాతీయ సర్వీసులపై నిషేధం పొడిగించింది. ఈ నెల 31వరకూ వాటిపై నిషేధం ఉంటుందని వారు తెలిపారు. కరోనా కారణంగా మార్చి 23 నుంచి అంతర్జాతీయ సర్వీసులను ప్రభుత్వం నిలిపేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య