War: ‘చురు’ యుద్ధంలో వెండి ఫిరంగి గుండ్లు
రాజుల కాలంలో ఎన్నో యుద్ధాలు జరిగాయి. వాటిలో గెలిచిన రాజులు.. ఓడిన రాజ్యాన్ని స్వాధీనం చేసుకునేవారు. అందుకే ఎవరైనా దండెత్తి వస్తే, ఏ రాజైనా చివరి నిమిషం వరకు తన రాజ్యాన్ని కాపాడుకోవాలనే ప్రయత్నించేవారు
(Photo: tourism-rajasthan.com)
ఇంటర్నెట్ డెస్క్: రాజుల కాలంలో ఎన్నో యుద్ధాలు జరిగాయి. వాటిలో గెలిచిన రాజులు.. ఓడిన రాజ్యాన్ని స్వాధీనం చేసుకునేవారు. అందుకే ఎవరైనా దండెత్తి వస్తే, ఏ రాజైనా చివరి నిమిషం వరకు తన రాజ్యాన్ని కాపాడుకోవాలనే ప్రయత్నించేవారు. ఈ క్రమంలోనే యుద్ధాల్లో సైనికులు ఇనుము, రాగి, ఇత్తడితో చేసిన ఫిరంగి గుండ్లను ప్రయోగించారని చరిత్రలో చదివాం.. సినిమాల్లో చూశాం. కానీ, ఓ రాజు ఫిరంగుల కోసం ఇనుప గుండ్లకు బదులు వెండి గుండ్లను ఉపయోగించాడట. ఆశ్చర్యంగా ఉంది కదా..! అయితే ఆ కథేంటో తెలుసుకుందాం!
రాజస్థాన్లోని చురు జిల్లాలో ఉన్న చురు కోటను 1694లో ఠాకూర్ కుశాల్ సింగ్ అనే చక్రవర్తి నిర్మించాడు. అప్పటి చురు రాజ్యంలోకి శత్రువులెవరూ ప్రవేశించకుండా రాజ్యానికి ముందుభాగంలో ఈ కోటను శత్రుదుర్భేద్యంగా తీర్చిదిద్దాడు. ఆయన మరణానంతరం అతడి వారసులు రాజ్యాన్ని పరిపాలిస్తూ వచ్చారు. అయితే, వెండి ఫిరంగి గుండ్ల ఘటన 1814లో చోటుచేసుకుంది. అప్పుడు చురు రాజ్యానికి ఠాకూర్ శివాజీ సింగ్ చక్రవర్తి. ఆ ఏడాది ఆగస్టులో పొరుగున ఉన్న బికనేర్ రాజ్యాన్ని పరిపాలిస్తున్న సూరత్ సింగ్.. చురు కోటపై దండెత్తి వచ్చాడు. దీంతో ఇరు రాజ్యాల మధ్య భీకర యుద్ధం జరిగింది. చురు రాజ్యంలోని యువకులు సైతం యుద్ధంలో పాల్గొని ప్రభుభక్తిని చాటుకున్నారు.
అయితే, కొన్ని రోజులకు చురు సైనికుల వద్ద ఆయుధాలు నిండుకున్నాయి. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉండగా.. చక్రవర్తికి ఓ ఆలోచన వచ్చింది. రాజ్యాన్ని కాపాడుకోవాలంటే యుద్ధంలో గెలవాల్సిందేనని, ఇందుకోసం ఆయుధాలు కావాలంటే ప్రజలు తమ బంగారు, వెండి ఆభరణాలు ఇవ్వాలని పిలుపునిచ్చాడు. దీంతో ప్రజలంతా ఏకతాటిపై నిలబడి తమ వద్ద ఉన్న ఆభరణాలను దానం చేశారు. అలా సేకరించిన వెండి ఆభరణాలను కరిగించి ఫిరంగు గుండ్లు తయారు చేయాలని శివాజీ సింగ్ సైనికులను ఆదేశించాడు. ఒకవైపు వెండి ఫిరంగి గుండ్లను తయారు చేస్తూ.. మరోవైపు వాటిని శత్రుసైన్యంపైకి ప్రయోగించారు. చివరికి ఈ యుద్ధంలో శివాజీ సింగ్ చక్రవర్తే విజయం సాధించి.. తన రాజ్యాన్ని కాపాడుకోగలిగాడు. చరిత్రలో ఏ రాజూ ఇలా వెండి ఫిరంగి గుండ్లను ఉపయోగించలేదని చరిత్రకారులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..