Karnataka: భార్యపై ప్రేమతో.. ఇంట్లోనే విగ్రహం!

మరణించిన తన భార్య ఎప్పటికీ కళ్లముందే ఉండాలని కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి వినూత్న ఆలోచన చేశాడు. భార్యపై ప్రేమతో ఆమె విగ్రహాన్ని తయారు చేయించి ఇంట్లో నెలకొల్పాడు. ..

Published : 08 Nov 2021 01:14 IST

బెంగళూరు: మరణించిన తన భార్య ఎప్పటికీ కళ్లముందే ఉండాలని కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి వినూత్న ఆలోచన చేశాడు. భార్యపై ప్రేమతో ఆమె విగ్రహాన్ని తయారు చేయించి ఇంట్లో నెలకొల్పాడు. బెల్గావికి చెందిన శివ, మీనాభాయి భార్యాభర్తలు. కొంతకాలం క్రితం మీనాభాయి అనారోగ్యంతో మృతి చెందారు. తీవ్ర మనస్థాపానికి గురైన శివ.. భార్య ఎప్పటికీ తనతోపాటే ఉండాలనే ఉద్దేశంతో ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో ఆమె విగ్రహాన్ని తయారు చేయించాడు. దీపావళి వేళ భారీ స్థాయిలో వేడుక నిర్వహించి భార్య విగ్రహాన్ని తన ఇంటి మధ్యలో ప్రతిష్ఠించాడు. భవిష్యత్‌లో మీనాభాయి పేరుతో బెల్గావిలో ఓ ఆస్పత్రి నిర్మించనున్నట్లు శివ తెలిపాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని