Allahabad Court: విద్యార్థినిని ఆదుకున్న న్యాయస్థానం.. అడ్మిషన్ ఫీజు కట్టిన అలహాబాద్ హైకోర్టు!
మంచి ర్యాంక్ సాధించి.. ప్రముఖ యూనివర్సిటీలో సీటు సంపాదించినా.. అడ్మిషన్ ఫీజు చెల్లించలేక ఇబ్బంది పడుతున్న ఓ విద్యార్థినికి అలహాబాద్ హైకోర్టు అండగా నిలిచింది. ఆమెను యూనివర్సిటీలో చేర్పించడం కోసం స్వయంగా అడ్మిషన్ ఫీజు రూ. 15వేలు చెల్లించింది.. మూడు రోజుల్లో
అలహాబాద్: మంచి ర్యాంక్ సాధించి.. ప్రముఖ యూనివర్సిటీలో సీటు సంపాదించినా.. అడ్మిషన్ ఫీజు చెల్లించలేక ఇబ్బంది పడుతున్న ఓ విద్యార్థినికి అలహాబాద్ హైకోర్టు అండగా నిలిచింది. ఆమెను యూనివర్సిటీలో చేర్పించడం కోసం స్వయంగా అడ్మిషన్ ఫీజు రూ. 15వేలు చెల్లించి.. మూడు రోజుల్లో యూనివర్సిటీలో చేరమని విద్యార్థినికి సూచించింది.
యూపీకి చెందిన విద్యార్థిని సంస్కృతి రంజన్ ఇటీవల జేఈఈ పరీక్షలో 92.77 పర్సంటైల్తో ఉత్తీర్ణత పొంది 2,062వ ర్యాంకు సాధించింది. ఎస్సీ కోటాలో మంచి ర్యాంకు పొందిన ఆమె బీహెచ్యూలో ఐదేళ్ల మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ కోర్సులో చేరాలని భావించింది. కానీ.. ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. పేదరికం.. పైగా ఆమె తండ్రి కిడ్నీ సమస్యతో డయాలసిస్ చేయించుకుంటున్నారు. దీంతో అడ్మిషన్ ఫీజు చెల్లించేందుకు తనకు మరికొంత గడువు ఇవ్వాలని జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీని అభ్యర్థించినా ఫలితం లేకుండా పోయింది.
యూనివర్సిటీలో అడ్మిషన్ ఫీజు చెల్లించలేక తీవ్ర నిరాశకు గురైన సంస్కృతి.. ఇద్దరు న్యాయవాదుల సాయంతో అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. తనకు ఎలాగైనా యూనివర్సిటీలో అడ్మిషన్ ఇచ్చేలా వర్సిటీ యాజమాన్యాన్ని, కేంద్ర విద్యాశాఖకు ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ దినేశ్కుమార్ సింగ్ ఆ అడ్మిషన్ ఫీజు రూ.15వేలు తామే చెల్లిస్తామని వెల్లడించారు. ‘ఎంతో బాగా చదువుకుంటున్న విద్యార్థిని ఫీజు చెల్లించలేక ఇబ్బంది పడుతోంది. ఆమె తండ్రి అనారోగ్యంపాలవడంతో ఫీజు చెల్లించే స్థోమత వారికి లేకుండాపోయింది. విద్యార్థిని కుటుంబ ఆర్థిక పరిస్థితి పరిగణలోకి తీసుకొని యూనివర్సిటీ అడ్మిషన్ ఫీజును కోర్టే చెల్లిస్తుంది’అని జస్టిస్ దినేశ్ కుమార్ సింగ్ పేర్కొన్నారు.
► Read latest National - International News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
పెద్ద సంఖ్యలో తరలిరండి.. ఓటర్లకు ప్రధాని మోదీ పిలుపు
-
కిడ్నాప్ చేయించి.. 30 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
-
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ