Anand Mahindra: వామ్మో! ఈ మనిషిని చూస్తే రోబో కూడా అసూయపడుతుందేమో..

ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్‌ మహీంద్రా సంస్థ అధినేత ఆనంద్‌ మహీంద్రా సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటూ తన ఫాలోవర్లకు ఏదో కొత్త విషయాన్ని తెలియజేస్తుంటారు‌.

Updated : 18 Aug 2021 13:47 IST

 

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్‌ మహీంద్రా సంస్థ అధినేత ఆనంద్‌ మహీంద్రా సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటూ తన ఫాలోవర్లకు ఏదో ఒక కొత్త విషయాన్ని తెలియజేస్తుంటారు‌. తాజాగా ఓ సరదా ట్వీట్‌తో మన ముందుకు వచ్చారు. 28 సెకన్ల నిడివి ఉన్న వీడియోలో ఓ వ్యక్తి అత్యంత వేగంగా దోశలు వేస్తూ కనిపిస్తాడు. రోబో సైతం సిగ్గుపడేంతలా వేగంగా పనిచేస్తున్నాడంటూ కొనియాడారు ఆనంద్‌. కేవలం దోశలు వేయడమే కాదు.. ఒకేసారి పళ్లెంలో వడ్డించి ఇచ్చేస్తున్న అతన్ని చూసి నేను అలసిపోయాను. అతడు దోశలు వేసే విధానం చూస్తే ఆకలి వేస్తోందంటూ సరదాగా రాసుకొచ్చారు. 24లక్షల వ్యూస్‌ దక్కించుకున్న ఈవీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోని తొలుత ఫిబ్రవరిలో ఇన్‌స్టాగ్రామ్‌లోని స్ట్రీట్‌ ఫుడ్‌ రెసిపీస్‌ అనే ఫుడ్‌ పేజీ షేర్‌ చేసింది. ఈ ఫుడ్‌కోర్ట్‌ ముంబయిలోని దాదర్‌లో ఉంది. ఇక్కడి రజనీకాంత్‌ స్టైల్‌ దోశ చాలా ఫేమస్‌..! 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని