Anand Mahindra: మన వాళ్లని తక్కువ అంచనా వేయొద్దు సుమీ!
వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో నిత్యం చురుగ్గా ఉంటూ.. సరికొత్త విషయాలు నెటిజన్లతో పంచుకుంటారన్న సంగతి తెలిసిందే. అందులో కొన్ని స్ఫూర్తిదాయకమైనవైతే.. మరి కొన్ని ఫన్నీగా ఉంటాయి. తాజాగా ఆయన ‘‘కెలాగ్స్ ఉమ్మా’’ మీద పోస్టు చేసిన మీమ్ నెట్టింట నవ్వులు పూయిస్తుంది. విషయానికొస్తే.. సరిగ్గా పదేళ్ల క్రితం ‘‘కేలాగ్స్’’ అనే అమెరికా ఆహార ఉత్పత్తి సంస్థ భారత్లో అడుగుపెట్టింది. ప్రారంభంలోనే.
ఇంటర్నెట్ డెస్క్: వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో నిత్యం చురుగ్గా ఉంటూ.. సరికొత్త విషయాలు నెటిజన్లతో పంచుకుంటారన్న సంగతి తెలిసిందే. అందులో కొన్ని స్ఫూర్తిదాయకమైనవైతే.. మరి కొన్ని ఫన్నీగా ఉంటాయి. తాజాగా ఆయన ‘‘కెలాగ్స్ ఉప్మా’’ మీద పోస్టు చేసిన మీమ్ నెట్టింట నవ్వులు పూయిస్తోంది. విషయానికొస్తే.. సరిగ్గా పదేళ్ల క్రితం ‘‘కెలాగ్స్’’ అనే అమెరికా ఆహార ఉత్పత్తి సంస్థ భారత్లో అడుగుపెట్టింది. ప్రారంభంలోనే.. ఇంకేముంది ‘‘భారతీయుల బ్రేక్ఫాస్ట్ అలవాట్లు మార్చేస్తాం.. ఇడ్లీ, ఉప్మా దోశ బదులు కార్న్ఫ్లేక్స్, చాకో పాప్స్ తినేలా చేస్తాం’’ అంటూ సవాళ్లు విసిరింది. మరి మన భారతీయులు వారి ఆలోచనకు లొంగకపోవడం సరికదా! చివరకు ఆ కంపెనీ చేత ‘ఉప్మా’ ఉత్పత్తి చేయించేలా చేశారు. సరిగ్గా ఇదే విషయాన్ని మహీంద్రా ప్రస్తావిస్తూ ..‘‘ ఈ సంస్థ ప్రారంభమై పదేళ్లు గడుస్తోంది. ఇది పాత మీమ్ అయినప్పటికీ.. ప్రస్తుతం అందరినీ మాట్లాడుకునేలా చేస్తోంది. అందుకే మన లోకల్ ‘ఛాంపియన్స్’ గురించి తక్కువ అంచనా వేయొద్దు’ అంటూ సరదాగా ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు సైతం తమదైన శైలిలో స్పందించారు. ‘‘మేము కేవలం ఆహారాన్ని మాత్రమే తినము. సెంటిమెంట్లను కూడా తింటాం’’ అని ఒకరనగా..ఇక బ్రేక్ఫాస్ట్లో వీరి నుంచి దోశ, ఇడ్లీ కూడా మార్కెట్లోకి వస్తుందనుకుంటున్నా అంటూ మరొకరు ఫన్నీ కామెంట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు మార్గంలో భారీగా ట్రాఫిక్జామ్: వాహనాలు నిలిపి.. కి.మీ మేర నడిచి..
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
నారాయణమూర్తి మనవడి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ