ఆటోపై ఇల్లు..అభినందించిన ఆనంద్ మహీంద్ర
సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర తాజాగా ఓ ట్వీట్ చేశారు. ఓ ఆర్కిటెక్ట్ ఆటో రిక్షాపై చిన్నపాటి ఇల్లును నిర్మించడం ఆయన్ను ఎంతగానో ఆకట్టుకుంది.
దిల్లీ: సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర తాజాగా ఓ ట్వీట్ చేశారు. ఓ ఆర్కిటెక్ట్ ఆటో రిక్షాపై చిన్నపాటి ఇల్లును నిర్మించడం ఆయన్ను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో సదరు వ్యక్తిపై ప్రశంసలు కురిపిస్తూ ఆయన ట్విటర్లో ఓ పోస్టు పెట్టారు. వివరాల ప్రకారం చెన్నైకి చెందిన అరుణ్ ప్రభు అనే ఆర్కిటెక్ట్ సుమారు లక్ష రూపాయల ఖర్చుతో ఓ రవాణా ఆటో రిక్షాపై ‘సోలో 1’ అనే పేరుతో చిన్న ఇంటిని నిర్మించుకున్నారు. ఆ ఫొటోలను ఓ ట్విటర్ యూజర్ షేర్ చేయడంతో ఆనంద్ మహీంద్ర దాన్ని చూసి మెచ్చుకున్నారు.
‘‘ చిన్న చిన్న ప్రాంతాల్లో అద్భుతాను సృష్టించొచ్చు అని అరుణ్ నిరూపించాడు. కానీ ఆయన ఆలోచన మాత్రం చాలా పెద్దది. కరోనా సంక్షోభం తర్వాత ఎప్పుడూ ఏదోక చోటుకు వెళ్లాలనుకొనే వారి కోరిక తీరే మార్గం ఇదే.’’ అని ఆనంద్ మహీంద్ర ఆ పోస్టులో పేర్కొన్నారు. ‘‘బొలెరో పికప్పై ఈ విధంగా అతడు రూపొందిస్తాడా అని నేను అడగాలనుకుంటున్నాను. మమ్మల్ని ఎవరైనా కనెక్ట్ చేయగలరా?’’ అని ఆనంద్ మహీంద్ర అడిగారు. దీంతో పలువురు నెటిజన్లు అరుణ్ప్రభు వివరాలను ఆనంద్ మహీంద్రాకు తెలుపుతున్నారు.
గతంలో అరుణ్ ప్రభు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మురికివాడల్లో తక్కువ స్థలంలో (6×6) మంచి గృహాలు ఏర్పాటు చేయొచ్చు అని తెలిపారు. ‘‘ సాధారణంగా మేము పెద్ద పెద్ద స్థలాల్లో వినూత్న నిర్మాణాలు ఏర్పాటు చేసేందుకే ప్రయత్నిస్తాం. కానీ చిన్న స్థలాల్లో నిర్మాణాలకు ప్రాముఖ్యత ఇవ్వం. నేను అభివృద్ధి చేస్తున్న సోలో 1 అనే నమూనా ద్వారా భారత్లో తాత్కాలిక, పోర్టబుల్ ఇళ్లను నిర్మించడమే నా లక్ష్యం.’’ అని అరుణ్ గతంలో వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిరంతరం రాష్ట్రం గురించి ఆలోచించే నేత చంద్రబాబు : పవన్
తెదేపా అధినేత చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దుర్గారావును చూపించాలంటూ ఆందోళన.. సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
నగరంలోని సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీపీ కాంతి రాణాను కలిసేందుకు వడ్డెర కుల సంఘం నేతలు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు. -
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు
తాజా వార్తలు (Latest News)
-
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
-
నిరంతరం రాష్ట్రం గురించి ఆలోచించే నేత చంద్రబాబు : పవన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్
-
ఆ ముగ్గురిని చూస్తే ముచ్చటేసింది.. రోహిత్ ఈజ్ బ్యాక్: హర్భజన్
-
దుర్గారావును చూపించాలంటూ ఆందోళన.. సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత