కరోనా టీకా తీసుకుంటున్నారా?
ఎన్నో పరిశోధనలు. ఎన్నో ప్రయోగాలు. ఎన్నో సవరణలు. ఎన్నో పరీక్షలు. ఇంత కష్టపడి రూపొందించినా టీకాలు పూర్తి రక్షణ కల్పించలేవు. కొందరిలో
ఎన్నో పరిశోధనలు. ఎన్నో ప్రయోగాలు. ఎన్నో సవరణలు. ఎన్నో పరీక్షలు. ఇంత కష్టపడి రూపొందించినా టీకాలు పూర్తి రక్షణ కల్పించలేవు. కొందరిలో సమర్థంగా పనిచేస్తే.. మరికొందరిలో అంత ప్రభావం చూపలేవు. ఎందుకు? మన శరీర స్వభావం మాట అటుంచితే ఇతరత్రా అంశాలేవైనా ఇందుకు దోహదం చేస్తాయా? పరిశోధనలు ఇదే చెబుతున్నాయి. కుంగుబాటు (డిప్రెషన్), మానసిక ఒత్తిడి (స్ట్రెస్), దురలవాట్ల వంటివి మన రోగనిరోధక వ్యవస్థ బలహీనపడటంలో, ఆయా టీకాల సామర్థ్యం తగ్గటంలో పాలు పంచుకుంటున్నాయని వివరిస్తున్నాయి. తాజా కొవిడ్-19 టీకాలకూ ఇదే వర్తిస్తుంది. మన అలవాట్లు, ప్రవర్తన మార్పులతో టీకాలకు శరీరం మరింత మెరుగ్గా స్పందించేలా చూసుకోవచ్చు. టీకా వేగంగా, సమర్థంగా పనిచేసేలా చూసుకోవచ్చు. ఇవేమీ కష్టమైన పనులు కావు. చాలా తేలికైనవే.
ఒత్తిడికి దూరం: ఒత్తిడితో బాధపడేవారిలో టీకాలకు యాంటీబాడీల ప్రతిస్పందన బలహీనపడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. అదే టీకా తీసుకునే రోజున మానసికంగా ఉత్సాహంగా ఉన్నవారిలో యాంటీబాడీల ప్రతిస్పందన బలంగా ఉంటోందని వివరిస్తున్నాయి. కాబట్టి ఒత్తిడికి దూరంగా ఉండటం, టీకా తీసుకునే సమయంలో ప్రశాంతంగా ఉండటం మంచిది. రోజూ ధ్యానం, ప్రాణాయామం వంటివి చేస్తుంటే ఒత్తిడి బారినపడకుండా కాపాడుకోవచ్చు.
కంటి నిండా నిద్ర: టీకా తీసుకోవటానికి ముందు రోజు నిద్ర సరిగా పట్టనివారితో పోలిస్తే కంటి నిండా నిద్రపోయినవారిలో రోగనిరోధక వ్యవస్థ చాలా చురుకుగా పనిచేస్తున్నట్టు పరిశోధనలు పేర్కొంటున్నాయి. ఇది యాంటీబాడీల ప్రతిస్పందన బలంగా ఉండటానికి తోడ్పడుతుంది. కాబట్టి నిద్ర బాగా పట్టేలా చూసుకోవటం అన్ని విధాలా మంచిది. ఇది టీకా తీసుకునే సమయంలో భయం, ఆందోళన తగ్గటానికీ ఉపయోగపడుతుంది.
నలుగురితో కలివిడిగా: ఒంటరితనంతో విచారం, దిగులు ఆవహిస్తాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థ పనితీరు మందగించేలా చేస్తాయి. టీకాకు యాంటీబాడీల ప్రతిస్పందన కూడా తగ్గుతుంది. కాబట్టి కుటుంబ సభ్యులు, స్నేహితులతో సన్నిహితంగా ఉండటం ఎవరికైనా మంచిదే. నలుగురితో కలివిడిగా ఉండటం వల్ల మానసిక బలం ఇనుమడిస్తుంది. ఇది రోగనిరోధక వ్యవస్థ చురుకుగా పనిచేయటానికి తోడ్పడుతుంది.
మద్యం జోలికి వెళ్లొద్దు: టీకా తీసుకోవటానికి ముందు రోజు, టీకా తీసుకున్న తర్వాత మద్యం జోలికి వెళ్లకుండా ఉండటమే ఉత్తమం. అతిగా మద్యం తాగితే రోగనిరోధక కణాల పనితీరు అస్తవ్యస్తమవుతుంది. ఇది శరీరం వైరస్ను ఎదుర్కోవటానికి అవసరమైన శక్తిని తగ్గిస్తుంది. మద్యం జోలికి వెళ్లకపోవటం, ఒకవేళ అలవాటుంటే పరిమితం చేసుకోవటం ఎంతైనా అవసరం.
వ్యాయామం మేలు: బద్ధకంగా కూర్చొనేవారితో పోలిస్తే తగినంత శారీరక శ్రమ చేసేవారిలో రోగనిరోధక వ్యవస్థ బాగా పనిచేస్తుంది. టీకా తీసుకోవటానికి 15 నిమిషాల ముందు నడవటం వంటి వ్యాయామాలు చేసినవారిలో టీకాలకు యాంటీబాడీల ప్రతిస్పందన మరింత ఎక్కువగా కనిపిస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక్క టీకా కోసమే కాదు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం ఆరోగ్యానికి అన్ని విధాలా మేలు చేసేదే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్
హైదరాబాద్ నగర శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. -
సైబర్ టవర్స్ వద్ద చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను హైదరాబాద్లో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. -
చంద్రబాబుకు ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు
తెదేపా అధినేత చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దుర్గారావును చూపించాలంటూ ఆందోళన.. సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
నగరంలోని సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీపీ కాంతి రాణాను కలిసేందుకు వడ్డెర కుల సంఘం నేతలు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు. -
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు
తాజా వార్తలు (Latest News)
-
వాటిని నమ్మకండి.. మహేశ్-రాజమౌళి సినిమాపై నిర్మాత కామెంట్స్
-
‘నా తమ్ముడికి ఓట్లేస్తే మీకు నీళ్లు’.. డీకే శివకుమార్ వ్యాఖ్యలపై కేసు నమోదు
-
‘చోటా కె గారు.. మీ గౌరవాన్ని కాపాడుకోండి’.. కాదు.. కూడదంటే I AM Waiting: హరీశ్
-
హెచ్డీఎఫ్సీ ఫలితాలు.. నికర లాభం రూ.17,622 కోట్లు
-
అనారోగ్య సమస్యలతో కేజ్రీవాల్ మరణించేలా కుట్ర: దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్
-
‘ఇంకెవరూ మీ భార్యే..’: కోహ్లీ ఆన్సర్కు షాకైన దినేశ్ కార్తిక్