తెలంగాణలో వ్యాక్సిన్ డెలివరికి డ్రోన్స్
వ్యాక్సిన్ పంపిణీ కోసం ప్రయోగాత్మకంగా డ్రోన్ వినియోగానికి తెలంగాణ రాష్ట్రానికి అనుమతి లభించింది. ఈ మేరకు
న్యూదిల్లీ: వ్యాక్సిన్ పంపిణీ కోసం ప్రయోగాత్మకంగా డ్రోన్ వినియోగానికి తెలంగాణ రాష్ట్రానికి అనుమతి లభించింది. ఈ మేరకు డీజీసీఏ(డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్)అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది పాటు ఈ అనుమతులు అమల్లో ఉంటాయి. అయితే, ఏ వ్యాక్సిన్ అన్నది మాత్రం డీజీసీఏ స్పష్టం చేయలేదు. పౌరుల ఇంటి వద్దకే హెల్త్కేర్ సేవలు అందించడం, సేవల పంపిణీ నేపథ్యంలో కొవిడ్-19 వ్యాప్తి చెందకుండా నియంత్రించడం దీని ప్రధాన ఉద్దేశం. చివరి మైలు వరకు ఆరోగ్య సేవలు అందించడం కూడా డ్రోన్ సేవల లక్ష్యం.
డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్ల పంపిణీపై అధ్యయనం చేయాల్సిందిగా ఏప్రిల్ 22న ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒకవైపు కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. రాష్ట్రాల వద్ద కోటి వ్యాక్సిన్ డోసులు ఉన్నట్లు చెబుతున్న ఆరోగ్యమంత్రిత్వశాఖ మరో మూడు రోజుల్లో 20 లక్షల డోస్లను అందించనున్నట్లు తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?