ఉస్మానియా ఆస్పత్రికి అఖిలప్రియ
మియాపూర్ సమీపంలోని హఫీజ్పేటలో భూ వివాదం, కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను వైద్య పరీక్షల కోసం పోలీసులు
హైదరాబాద్: మియాపూర్ సమీపంలోని హఫీజ్పేటలో భూ వివాదం, కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను వైద్య పరీక్షల కోసం పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం బాగాలేదని.. ఆస్పత్రిలో చూపించాలని అఖిలప్రియ జైలు అధికారులను కోరడంతో మధ్యాహ్నం ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ఆమెకు సీటీ స్కాన్, ఇతర వైద్య పరీక్షలు చేశారు. అనంతరం చంచల్గూడ మహిళా జైలుకు తరలించారు. నిన్న సికింద్రబాద్ కోర్టు కూడా అఖిలప్రియ ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది.
కిడ్నాప్ కేసులో ప్రస్తుతం అఖిలప్రియ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. భూ వివాదం నేపథ్యంలో ప్రవీణ్రావు, సునీల్ రావు, నవీన్ రావు అనే ముగ్గురు సోదరులను కిడ్నాప్ చేసిన కేసులో అఖిలప్రియతోపాటు, ఆమె భర్త భార్గవరామ్,తెదేపా నేత ఏవీ సుబ్బారెడ్డి నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మేరకు రెండు రోజుల క్రితం కూకట్పల్లిలోని తన నివాసంలో అఖిలప్రియను పోలీసులు అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరు పరిచారు. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో ప్రస్తుతం ఆమె చంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
ఇదీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్