అప్పగింతల్లో ఏడ్చిఏడ్చి.. వధువుకు గుండెపోటు

అప్పటిదాకా పెళ్లి వేడుకలతో కళకళలాడిన ఆ ఇంట్లో ఒక్కసారిగా విషాధ ఛాయలు అలుముకున్నాయి. పుట్టింటిని వదల్లేక అప్పగింతల సమయంలో ఎక్కువగా ఏడ్చి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిందో నవ

Published : 06 Mar 2021 13:59 IST

భువనేశ్వర్‌: అప్పటిదాకా పెళ్లి వేడుకలతో కళకళలాడిన ఆ ఇంట్లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. పుట్టింటిని వదల్లేక అప్పగింతల సమయంలో ఎక్కువగా ఏడ్చి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిందో నవ వధువు. ఈ విషాద ఘటన ఒడిశాలోని సోనేపుర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

జులుందా గ్రామానికి చెందిన గుప్తేశ్వరి సాహూ అలియాస్‌ రోజీకి బాలాంగిర్‌ జిల్లా తెటెల్‌గావ్‌ గ్రామానికి చెందిన బిశికేశన్‌తో వివాహం నిశ్చయమైంది. శుక్రవారం వీరి పెళ్లి ఘనంగా జరిగింది. వేడుకల అనంతరం వధువు కుటుంబసభ్యులు కూతుర్ని అత్తవారింటికి సాగనంపేందుకు ‘బిదాయి(అప్పగింతలు)’ జరుపుతుండగా.. రోజీ ఏడుస్తూనే ఉంది. అలా ఏడ్చిఏడ్చి ఉన్నట్టుండి కుప్పకూలింది. దీంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు ఆమెను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. గుండెపోటుతో రోజీ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు వెల్లడించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని