భారత్, బంగ్లాదేశ్ సరిహద్దు భద్రతా దళాల సమావేశం
భారత్, బంగ్లాదేశ్ సరిహద్దు భద్రతా దళాల(బీఎస్ఎఫ్) సమన్వయ సమావేశం మంగళవారం ప్రారంభమైంది. మూడురోజుల పాటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్న ఈ సమావేశం గురువారంతో ముగియనుందని అధికారులు వెల్లడించారు
దిల్లీ: భారత్, బంగ్లాదేశ్ సరిహద్దు భద్రతా దళాల(బీఎస్ఎఫ్) సమన్వయ సమావేశం మంగళవారం ప్రారంభమైంది. మూడురోజుల పాటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్న ఈ సమావేశం గురువారంతో ముగియనుందని అధికారులు వెల్లడించారు. ఇరు దేశాల మధ్య సరిహద్దును సమర్థంగా నిర్వహించడంలో భాగంగా అక్కడ జరిగే నేరాలు, అక్రమ చొరబాట్లను అరికట్టేందుకు చర్యలు, పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు. పరస్పర సమన్వయంతో గస్తీ నిర్వహించడం, సాంకేతిక సహకారం, ప్రమాదకర ప్రాంతాల గుర్తింపు తదితర అంశాలకు సంబంధించి సరిహద్దు నిర్వహణ ప్రణాళికను రూపొందిస్తామని చెప్పారు. ఇరు దేశాల ప్రాధాన్యాలను దృష్టిలో పెట్టుకొని.. సరిహద్దులో నెలకొన్న సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ఈ సమావేశాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇరు దేశాల భద్రతా దళాల మధ్య మైత్రిని పెంపొందించడం కూడా ఇందులో భాగమన్నారు.
ఇలాంటి సమావేశం నిర్వహించడం ఈ నెలలో ఇది రెండోసారి. ఈ నెల 7న ప్రారంభమైన సరిహద్దు సమన్వయ సమావేశం నాలుగు రోజులపాటు నిర్వహించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు