హైదరాబాద్‌లో సి.నరసింహారావు సంతాప సభ.. హాజరైన ప్రముఖులు

ఇటీవల మృతిచెందిన ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, రాజకీయ, సామాజిక విశ్లేషకులు, జర్నలిస్టు సి.నరసింహారావుకు కుటుంబసభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు నివాళులర్పించారు.

Updated : 22 May 2022 20:39 IST

హైదరాబాద్‌: ఇటీవల మృతిచెందిన ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, రాజకీయ, సామాజిక విశ్లేషకులు, జర్నలిస్టు సి.నరసింహారావుకు కుటుంబసభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు నివాళులర్పించారు. ఈనెల 12న కన్నుమూసిన నరసింహారావు సంతాప సభను హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయనకు అత్యంత ఆప్తులు, సహచర పాత్రికేయ మిత్రులు, శ్రేయోభిలాషులు హాజరై శ్రద్ధాంజలి ఘటించారు. 

ఈ సందర్భంగా నరసింహారావుతో తమకున్న అనుబంధాన్ని వక్తలు నెమరువేసుకున్నారు. అనంతరం ‘రేపటి మనిషి’ పేరుతో రూపొందించిన పుస్తకాన్ని నరసింహారావు కుటుంబసభ్యులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్‌ నారాయణ, ‘ఈనాడు’ ఆంధ్రప్రదేశ్‌ ఎడిటర్‌ ఎం.నాగేశ్వరరావు, మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్‌, ఎంపీలు సుజనాచౌదరి, రఘురామకృష్ణరాజు, మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ, గుమ్మడి గోపాలకృష్ణ, కె.రామచంద్రమూర్తి, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, గజల్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని