కొవిడ్ టీకా: పెయిన్ కిల్లర్ తీసుకోవచ్చా..?
కరోనా వ్యాక్సిన్ తీసుకునే ముందు, లేదా తీసుకున్న తర్వాత పెయిన్ కిల్లర్లను వాడకపోవడమే మంచిదని వైద్య నిపుణులు స్పష్టంచేస్తున్నారు.
వాషింగ్టన్: కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రపంచ వ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతోన్న విషయం తెలిసిందే. అయితే, వ్యాక్సిన్ తీసుకునే సమయంలో వచ్చే నొప్పి, ఇతర అనారోగ్య సమస్యలను తగ్గించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంపై నిపుణులు సూచనలు చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా, కరోనా వ్యాక్సిన్ తీసుకునే ముందు, లేదా తీసుకున్న తర్వాత పెయిన్ కిల్లర్లను వాడకపోవడమే మంచిదని స్పష్టంచేస్తున్నారు. వీటిపై ఆధారాలు తక్కువగానే ఉన్నప్పటికీ, వ్యాక్సిన్ పనితీరును నొప్పి నివారణ మందులు(పెయిన్ కిల్లర్లు) ప్రభావితం చేస్తాయని పేర్కొంటున్నారు.
శరీరంలో వైరస్ ఉందని భావించి, వాటిని ఎదుర్కొనే రోగనిరోధకత కణాల పెరుగుదలకు మనం తీసుకునే వ్యాక్సిన్లు కృషిచేస్తాయి. అయితే, వీటి ప్రతిచర్యలో భాగంగానే జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పుల వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని తగ్గించుకునేందుకు కొందరు నొప్పి నివారణ మందులను వాడతారు. ఇలాంటి నొప్పులను లక్ష్యంగా చేసుకొని పనిచేసే మందుల వల్ల రోగనిరోధకత ప్రతిస్పందనకు ఆటంకం కలిగించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, ఈ లక్షణాలే మీ రోగనిరోధక శక్తి పుంజుకుంటుందని, వ్యాక్సిన్ పనిచేస్తుందనడానికి నిదర్శనం. అనారోగ్య సమస్యలతో తీసుకునే పెయిన్ కిల్లర్స్ వ్యాక్సిన్ తీసుకున్నాక వచ్చే రోగనిరోధకతను అడ్డుకునే అవకాశం ఉందని అమెరికా వ్యాధి నివారణ, నియంత్రణ కేంద్రం(సీడీసీ) నిపుణులు డాక్టర్ రోచెల్లీ వాలెన్స్కై స్పష్టంచేశారు. ఇలాంటి మందులు వ్యాక్సిన్ వల్ల వృద్ధిచెందే యాంటీబాడీల ఉత్పత్తిని తగ్గిస్తున్నట్లు ఇటీవల ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో తేలినట్లు పేర్కొన్నారు. తాజాగా వీటికి సంబంధించిన పరిశోధన పత్రం జర్నల్ ఆఫ్ వైరాలజీలో ప్రచురితమైంది.
పెయిన్ కిల్లర్లను తీసుకునే అలవాటు ఉన్నవారు తప్ప, మిగతా వారు వ్యాక్సిన్ తీసుకునే ముందు, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత పెయిన్ కిల్లర్ తీసుకోవాల్సి వస్తే కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా, ఇలాంటి నొప్పి నివారణ మందులు వాడకపోవడమే మంచిదని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వైద్యులు పేర్కొంటున్నారు. ఒకవేళ తీసుకోవాల్సి వస్తే రోగనిరోధకతపై ప్రభావం చూపని ఎసిటమైనోఫెన్(టైలెనోల్) వంటి మందులు వాడవచ్చని సూచిస్తున్నారు. ఇక, వ్యాక్సిన్ తీసుకున్న చోట నొప్పి ఉన్నట్లయితే, చల్లని తడిబట్టతో అక్కడ మర్దన చేసుకోవాలి, జ్వరం ఉన్నట్లయితే పండ్లరసాలను తీసుకోవాలని సీడీసీ సూచిస్తోంది.
ఇవీ చదవండి..
కరోనా టీకా: డోసుల వ్యవధి ఎంత ఉండాలి?
కొవిడ్ టీకా: పుకార్లు వ్యాప్తిచేస్తే చర్యలు తప్పవ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైకోర్టుల్లోనూ మౌలిక సౌకర్యాల కొరత: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువయ్యేలా మార్పులు రావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆకాంక్షించారు. -
ఏపీలో పింఛన్ల పంపిణీ.. వాలంటీర్లకు కీలక ఆదేశాలు
ఏప్రిల్, మే నెల పింఛన్ల పంపిణీకి వాలంటీర్లు ఆథరైజేషన్ పత్రాలు తీసుకోవాలని గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్) సర్క్యులర్ జారీ చేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ప్రజలు ఉదాసీనంగా ఉన్నంత కాలం నిబంధనలు అమలు కావు: జస్టిస్ చలమేశ్వర్
ప్రజలు ఉదాసీనంగా ఉన్నంత కాలం ఎన్ని నిబంధనలు ఉన్నా అమలు కావని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. -
ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
నేడు నగరంలోని ఉప్పల్ స్టేడియంలో ముంబయి-హైదరాబాద్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రామ్చరణ్ దంపతులు
తిరుమల శ్రీవారిని సినీనటుడు రామ్చరణ్, ఉపాసన దంపతులు దర్శించుకున్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మావయ్యా.. ఇదేం ప్రగతయ్యా..?
నాడు-నేడు అంటూ విద్యా వ్యవస్థలో, మౌలిక సదుపాయాల కల్పనలో ఎన్నో సమూల మార్పులు తెచ్చామని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా.. నేటికీ పలు చోట్ల ఆ ప్రగతి కనిపించడం లేదు. -
డబ్బులు ఇస్తారా.. స్టేషన్కు వస్తారా..!
కొంతమంది పోలీసులు అధికారుల ఆదేశాలను అడ్డుగా పెట్టుకుని వసూళ్లకు పాల్పడుతున్నారు. తాము నిబంధనలు ఉల్లంఘించలేదని తమను వదిలిపెట్టాలని బాధితులు వేడుకుంటున్నా వారు వినిపించుకోకుండా తమదైన ముద్ర చూపుతున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.. -
ప్రయాణికుల రద్దీ.. 32 ప్రత్యేక రైళ్ల సర్వీసులు పొడిగింపు
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. ఆ రైళ్ల వివరాలివే..
తాజా వార్తలు (Latest News)
-
2030 నాటికి విమాన సర్వీసులు డబుల్..
-
ఉప్పల్లో సిక్సర్ల మోత.. ముంబయిని ఓడించి బోణీ కొట్టిన హైదరాబాద్
-
ఆరోగ్యకరమైన జీవితానికి మూడు సూత్రాలు.. డాక్టర్ ఫార్ములా షేర్ చేసిన హర్ష గోయెంకా
-
వారిద్దరు టామ్ అండ్ జెర్రీలా.. మెగా, మంచు ఫ్యామిలీలపై మనోజ్ డైలాగ్
-
26/11 హీరో సదానంద్ వసంత్ దాటేకు ఎన్ఐఏ పగ్గాలు
-
కాంగ్రెస్ ఎనిమిదో జాబితా.. తెలంగాణలో మరో నాలుగు స్థానాలకు అభ్యర్థుల ప్రకటన