Strange Addictions: ఎక్కడికెళ్లినా భర్త చితాభస్మంతోనే.. అప్పుడప్పుడు రుచి చూడాల్సిందే!
మనకు ఇష్టమైనవారు.. జీవిత భాగస్వామి.. ఇలా ఎవరైనా మననుంచి శాశ్వతంగా దూరమైతే ఆ బాధ భరించలేనిది! ఈ క్రమంలో కొందరు.. మరణించినవారి జ్ఞాపకాలకు గుర్తుగా స్మారకాలు నిర్మించడమో, వారి విగ్రహాలను తయారు చేయించి పూజించడమో చేస్తుంటారు...
ఇంటర్నెట్ డెస్క్: మనకు ఇష్టమైనవారు.. జీవిత భాగస్వామి.. ఇలా ఎవరైనా మననుంచి శాశ్వతంగా దూరమైతే ఆ బాధ భరించలేనిది! ఈ క్రమంలో కొందరు.. మరణించినవారి జ్ఞాపకాలకు గుర్తుగా స్మారకాలు నిర్మించడమో, వారి విగ్రహాలను తయారు చేయించి పూజించడమో చేస్తుంటారు. కానీ.. యూకేకు చెందిన ఓ 26 ఏళ్ల మహిళ మాత్రం అసాధారణంగా ప్రవర్తిస్తున్నారు. చనిపోయిన తన భర్త చితాభస్మాన్ని వెంటపెట్టుకుని తిరుగుతున్నారు. అంతటితో ఆగకుండా.. అప్పుడప్పుడు దాన్ని తింటుండటం గమనార్హం.
తోటివారు షాక్!
యూకేకు చెందిన కాసీకి, సీన్కు 2009లో పెళ్లయింది. అన్యోన్యంగా ఉంటున్న ఈ జంటను విధి వెక్కిరించింది. కొన్నాళ్ల క్రితం అస్తమా బారినపడి సీన్ కన్నుమూశాడు. భర్త అంత్యక్రియలు నిర్వహించిన కాసీ.. అప్పటినుంచి అతని చితాభస్మాన్ని తనతోపాటు ప్రతిచోటా తీసుకెళ్లడం ప్రారంభించారు. షాపింగ్కు, సినిమాకు, హోటళ్లకు ఇలా.. ఎక్కడికెళ్లినా వెంట ఉండాల్సిందే. అయితే.. ఇదంతా సాధారణమేనని భావించే తోటివారు.. ఆమె ఆ చితాభస్మాన్ని కొద్దికొద్దిగా తింటుండటం చూసి షాక్కు గురవుతున్నారు! ఈ విషయాన్ని ఆమె సైతం అంగీకరించారు.
‘తింటున్న కొద్దీ ఉత్సాహం’
‘నా భర్త నుంచి దూరం కావలడనుకోవడంలేదు. కాబట్టే ఇలా చేస్తున్నాను. రెండు నెలలవుతున్నా దీన్ని మానుకోలేకపోతున్నా’ అని పేర్కొంటున్నారు. మొదట్లో చితాభస్మం వాసన కుళ్లిన గుడ్ల మాదిరి వచ్చేదని, ఇప్పుడు అలవాటు అయిందని చెబుతుండటం గమనార్హం. ‘చితాభస్మం డబ్బా తెరిచినప్పుడల్లా ఆనందం కలుగుతుందని, దాన్ని తింటున్న కొద్దీ మరింత ఉత్సాహం కలుగుతుందని ఆమె వివరిస్తున్నారు. ఆమె ఈ అలవాటును స్థానికంగా ‘ప్రజల వింత వ్యసనాల’పై రూపొందించిన ఒక కార్యక్రమంలోనూ ప్రదర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. -
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
వైకాపా ప్రచారరథం ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్గా మారిన నిందితుడు శరత్ చంద్రారెడ్డి, సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారారు. -
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేశాం: రంగరాజన్
హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేసినట్టు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి