Water Candles: దీపావళికి ‘వాటర్ క్యాండిల్స్’ సిద్ధం చేసుకోండి ఇలా!
దీపావళి రోజు మట్టి ప్రమిదల్లోనే చాలా మంది దీపాలు వెలిగిస్తుంటారు. అదీ కాకుంటే ఇత్తడి, రాగి, ఇనుము ప్రమిదలను ఉపయోగిస్తుంటారు. అవేవీ కాకుండా నీటితోనూ దీపాలు వెలిగించొచ్చు
నీటిలో వెలుగులు ఎలా తేవాలంటే..
ఇంటర్నెట్ డెస్క్: దీపావళి రోజు మట్టి ప్రమిదల్లోనే చాలా మంది దీపాలు వెలిగిస్తుంటారు. అదీ కాకుంటే ఇత్తడి, రాగి, ఇనుము ప్రమిదలను ఉపయోగిస్తుంటారు. అవేవీ కాకుండా నీటిలోనూ దీపాలు వెలిగించొచ్చు. మరి ఈ దీపావళికి ఇంట్లో నీటి దీపాలను వెలిగించాలనుకుంటే ఇది ఫాలో అవ్వండి. దీన్ని తయారు చేయడమూ తేలికే. ఓ గాజు గ్లాసులో నీళ్లు పోసి వృథాగా ఉన్న ప్లాస్టిక్ పూలు, ఎండిపోయిన పూల రెక్కలు, రంగు రాళ్లు, పూసలను వెయ్యండి. వాటర్ కలర్ కాకుండా వేరే కలర్ కావాలంటే ఫుడ్కలర్ ఎల్లో, ఆరెంజ్, గ్రీన్.. అలాగే ఉజాలా కూడా కలపొచ్చు. అందులో ఓ టీ స్పూన్ దీపాల నూనె (లేదా) వంటె నూనె పోయండి. సువాసనలు కావాలనుకుంటే ఎసెన్షియల్ ఆయిల్స్ రెండు మూడు చుక్కలు వేయండి ఇప్పుడు దళసరిగా ఉన్న ప్లాస్టిక్ కాగితాన్ని తీసుకొని రౌండ్ షేప్లో కత్తిరించుకోవాలి. దానికి సరిపడా చిన్నరంధ్రం చేసి దాని మధ్యలోంచి ఒత్తిని లాగాలి. అప్పుడు ఈ ఒత్తి నీటిలో తేలుతుంది. ఇప్పుడు దీపాన్ని వెలిగించండి. మరి ఈ వాటర్ క్యాండిల్స్ ప్రత్యేకత ఏమిటనేగా ప్రశ్న! మాములు దీపాల కంటే ఎక్కువ సేపు వెలుగుతాయి. అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. ఇంకెందుకు ఆలస్యం ఈ దీపావళికి వాటర్ క్యాండిల్స్ని వెలిగించండి.
నీటిలో వెలిగించిన దీపాల చిత్రాలను చూడండి!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 100 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!