చైనా యూనివర్సిటీలో వర్చువల్ విద్యార్థిని!
చైనాలో పలు టెక్నాలజీ సంస్థలు కలిసి ఏకంగా భౌతిక ప్రపంచానికి సంబంధం లేని ఒక వర్చువల్ విద్యార్థినిని రూపొందించాయి. అదీ కూడా కృత్రిమ మేథతో రూపొందించిన వర్చువల్ విద్యార్థిని
(Photo: Tsinghua University Youtube Screenshot)
ఇంటర్నెట్ డెస్క్: కరోనా కారణంగా విద్యాలయాలన్నీ మూతపడిన విషయం తెలిసిందే. దీంతో విద్యార్థులంతా ఆన్లైన్ తరగతులకు హాజరవుతున్నారు. పాఠాలు, పరీక్షలు, సెమినార్లు.. ఇలా అన్నీ ఆన్లైన్లోనే ఉన్నా.. విద్యార్థులు మాత్రం ఇంటి నుంచి స్వయంగా పాల్గొనాల్సిందే. అయితే చైనాలో పలు టెక్నాలజీ సంస్థలు కలిసి ఏకంగా భౌతిక ప్రపంచానికి సంబంధం లేని ఒక వర్చువల్ విద్యార్థినిని రూపొందించాయి. అదీ కూడా కృత్రిమ మేథతో రూపొందించిన వర్చువల్ విద్యార్థిని. ఇటీవల ఆమె సింఘువా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ కోర్సులో అడ్మిషన్ సంపాదించింది.
హువా హైబింగ్.. చైనాలో కృత్రిమ మేథ కలిగిన తొలి వర్చువల్ విద్యార్థినిగా గుర్తింపు పొందింది. హువాను బీజింగ్ అకాడమీ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(బీఏఏఐ), జైఫు ఏఐ, షియోఐస్ సంస్థలు కలిసి రూపొందించాయి. ఏ విషయాన్నైనా త్వరగా నేర్చుకునేలా శాస్త్రవేత్తలు ఆమెను తీర్చిదిద్దారు. ఇప్పటికే హువా పద్యాలు, చిత్రలేఖనం నేర్చుకుంటోందట. కోడింగ్లోనూ నైపుణ్యం సంపాదించడానికే ఆమెను ఈ కోర్సులో చేర్చినట్లు ఏఐ సంస్థలు వెల్లడించాయి. రోబోలాగా కాకుండా.. ఈ వర్చువల్ విద్యార్థిని మనిషిలాగే ఇతరులను పరిచయం చేసుకొని చక్కగా మాట్లాడగలదట. మనిషిలాగే ఆలోచిస్తూ.. భావోద్వేగాలనూ పలికించగలదని సింఘువా వర్సిటీ ప్రొఫెసర్ టాంగ్ జీ వెల్లడించారు. ఇటీవల నిర్వహించిన బీఏఏఐ సమావేశంలో హువా తనకు తానుగా పరిచయం చేసుకొని తన వివరాలు వెల్లడించింది. ఆ వీడియోను మీరూ చూసేయండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!
-
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ