CM Jagan Davos Tour: దావోస్‌లో ఏపీ పెవిలియన్‌ను ప్రారంభించిన సీఎం జగన్

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ఏపీ ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన పెవిలియన్‌ను సీఎం జగన్‌ ఆవిష్కరించారు.

Published : 22 May 2022 16:18 IST

అమరావతి: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ఏపీ ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన పెవిలియన్‌ను సీఎం జగన్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు.

అంతకుముందు వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం కాంగ్రెస్‌ సమావేశంలో సీఎం జగన్‌ పాల్గొన్నారు. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సహ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్‌ క్లాస్‌ ష్వాప్‌తో సీఎం సమావేశమయ్యారు. సదస్సుకు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుడివాడ అమర్నాథ్‌, ఏపీ మారిటైం బోర్డు ఛైర్మన్‌ కాయల వెంకటరెడ్డి తదితరులు హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని