Odisha: కరోనా వైరస్‌ ఆకారంలో దోసకాయ!

ఒడిశాలోని ఓ రైతు పొలంలో.. కరోనా వైరస్ ఆకారంలో దోసకాయ కాసింది. నవరంగ్‌పుర్ జిల్లా సారగూడ గ్రామానికి చెందిన రవి కిరణ్ నాగ్ అనే రైతు పొలంలో... ఈ వింత దోసకాయ కాసింది.

Published : 17 Nov 2021 01:22 IST

భువనేశ్వర్‌: ఒడిశాలోని ఓ రైతు పొలంలో.. కరోనా వైరస్ ఆకారంలో దోసకాయ కాసింది. నవరంగ్‌పుర్ జిల్లా సారగూడ గ్రామానికి చెందిన రవి కిరణ్ నాగ్ అనే రైతు పొలంలో... ఈ వింత దోసకాయ కాసింది. అన్ని దోసకాయలూ మామూలుగానే ఉండగా.. ఒక్కటి మాత్రం విభిన్నంగా ఉంది. కరోనా వైరస్‌ను పోలినట్లుగానే దీనిపై కొమ్ముల లాంటి ఆకారాలు ఉన్నాయి. వింత ఆకారంలో ఉన్న దోసకాయను ఫొటో తీసిన రవి కిరణ్.. సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. వాటిని సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. ఈ దోసకాయను చూసేందుకు చాలా మంది పొలం వద్దకు సైతం వస్తున్నారని రవి కిరణ్ చెబుతున్నాడు. దోసకాయతో సెల్ఫీలు దిగేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నట్టు తెలిపాడు. 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని