Tamilnadu: పేడతో కొట్టుకుంటేనే వాళ్లకు దీపావళి!
దీపావళి పర్వదినాన్ని సాధారణంగా ఇళ్ల ముందు దీపాలు వెలిగించి, రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించి టపాసులు కాల్చుతూ.. ఆనందంగా జరుపుకొంటారు. కానీ, తమిళనాడులోని ఓ గ్రామంలో మాత్రం దీపావళిని..
చెన్నై: దీపావళి పర్వదినాన్ని సాధారణంగా ఇళ్ల ముందు దీపాలు వెలిగించి, రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించి టపాసులు కాల్చుతూ.. ఆనందంగా జరుపుకొంటారు. కానీ, తమిళనాడులోని ఓ గ్రామంలో మాత్రం దీపావళిని వినూత్నంగా చేసుకున్నారు. ఆవు పేడతో కొట్టుకుంటూ పండగ జరుపుకొన్నారు. తమిళనాడులోని ఈరోడ్ జిల్లా గుమటపురం గ్రామానికి చెందిన ప్రజలు పండుగ రోజు ఒకే చోట చేరి గోరాయ్ హబ్బా అనే కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆవుపేడను ఒకరిపై ఒకరు విసురుకుంటూ సందడిగా గడిపారు. ఈ పండుగలో గ్రామస్థులు శరీరభాగాలకు పేడను పూసుకుంటూ వేడుక చేసుకుంటారు. పేడను విసురుకునేటప్పుడు కోపాన్ని దరి చేరనీయకుండా ఇతరుల పట్ల స్నేహభావాన్నే కలిగి ఉంటారు. పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయాన్ని గుమటపురం గ్రామప్రజలు కొనసాగిస్తున్నారు. 100 ఏళ్ల నుంచి ఈ పండుగను జరుపుకుంటున్నామని గ్రామస్థులు చెబుతున్నారు.
ఆవుపేడను చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సేకరించి గ్రామంలోని ధీరేశ్వర దేవాలయం వద్ద పోగుచేస్తారు. ఆ ప్రదేశాన్ని రంగు రంగుల కాగితాలతో అలంకరిస్తారు. పండుగ రోజు అక్కడికి గుంపుగా వెళ్లి దేవాలయంలో పూజలు నిర్వహిస్తారు. అనంతరం పేడను ఒకరిపై ఒకరు విసురుకుంటారు. సంప్రదాయంగా ప్రతి ఏడాదీ ఈ పండగను జరుపుకొంటామని, కుల వివక్షకు తావులేకుండా అందరం కలిసి ఒక చోట ఈ వేడుకను నిర్వహిస్తామని గ్రామస్థులు తెలిపారు. కలిసి మెలిసి జీవించాలనే సందేశాన్ని ‘గోరాయ్ హబ్బా’ కార్యక్రమం ఇస్తుందని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
-
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ