Night Curfew: తెలంగాణలో పొడిగింపు
తెలంగాణలో ప్రస్తుతం అమల్లో ఉన్న రాత్రి కర్ఫ్యూను రాష్ట్ర ప్రభుత్వం మరో వారం పొడిగించింది. మే 8 ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూని..
హైదరాబాద్: తెలంగాణలో ప్రస్తుతం అమల్లో ఉన్న రాత్రి కర్ఫ్యూను రాష్ట్ర ప్రభుత్వం మరో వారం పొడిగించింది. మే 8 ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా ఉద్ధృతి దృష్ట్యా ఈ నెల 20వ తేదీ నుంచి రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ విధించింది. అది శనివారం ఉదయం 5 గంటలకు ముగియనుంది. ప్రస్తుతం కేసుల సంఖ్య మరింత పెరిగినందున మరికొన్ని రోజులు కర్ఫ్యూ కొనసాగించాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. బుధవారం హోంమంత్రి మహమూద్ అలీ సైతం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి రాష్ట్రంలోని పరిస్థితులు తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్కుమార్ కర్ఫ్యూ పొడిగింపు ఉత్తర్వులు జారీ చేశారు. ఆదేశాలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలను సీఎస్ ఆదేశించారు.
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. రాత్రి కర్ఫ్యూ తర్వాత కరోనా కట్టడి చర్యలు వెల్లడించకపోవడంపై న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. దీనిపై పూర్తి వివరాలు తెలపాలని అడ్వొకేట్ జనరల్ను కోర్టు ఆదేశించింది. ప్రభుత్వం చెప్పకపోతే తామే ఆదేశాలిస్తామని న్యాయస్థానం హెచ్చరించింది. హైకోర్టులో విచారణ జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే కర్ఫ్యూని పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఇదే విషయాన్ని హైకోర్టుకు తెలిపింది.
రాష్ట్రంలో ఇంకా ఏమైనా ఎన్నికలు జరగాల్సి ఉన్నాయా? హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించగా.. ఎలాంటి ఎన్నికలు లేవని అడ్వొకేట్ జనరల్ సమాధానం ఇచ్చారు. ఎన్నికలు పెట్టి ప్రజలను ఆశ్చర్యపరచొద్దని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకున్న ఉన్నత న్యాయస్థానం విచారణను మే 5వ తేదీకి వాయిదా వేసింది.
సినిమా ప్రదర్శనలపై..
రాష్ట్ర ప్రభుత్వం నైట్ కర్ఫ్యూని పొడిగించిన నేపథ్యంలో థియేటర్లలో సినిమా ప్రదర్శనలపై ఆంక్షలను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. మే 8వ తేదీ వరకు ఆంక్షలు పొడిగిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ