నేను కూడా టీకా వేసుకున్నా!
ప్రాణానికి రక్షణ కల్పించే టీకాను దూరంచేసుకోకుండా స్ఫూర్తినిచ్చే వీడియో..
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది కోట్ల అరవై లక్షలకు పైగా ప్రజలకు కరోనా సోకింది. వారిలో పద్దెనిమిది లక్షల మందికి పైగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ పరిస్థితుల్లో కరోనా వైరస్ను కట్టడి చేసే టీకా కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తుంటే.. మరికొందరు ఇంజక్షన్ (సూదిమందు) అంటే ఉన్న భయంతో టీకా వేయించుకోమనే వారూ ఉన్నారు. ఇలాంటి విచిత్రమైన కారణంతో ప్రాణానికి రక్షణ కల్పించే టీకాను దూరంచేసుకోకుండా.. వారికి స్ఫూర్తినిచ్చే వీడియో ఒకటి ఇటీవల వైరల్ అవుతోంది. ఇది సరదా సరదాగా నవ్విస్తూనే, సూదిమందు తీసుకోవటం ఎంత సులభమో చెపుతోంది. ఇంతకీ ఇందులో ఏముందంటే..
ఓ తండ్రి, కుమార్తె టీకా వేయించుకునేందుకు ఆరోగ్య కేంద్రానికి వస్తారు. ఐతే ఇంజక్షన్ తీసుకునేందుకు ఆ చిన్నారి భయపడుతుంది. పాప ఆందోళనను తగ్గించేందుకు అక్కడి నర్సు, ఆ వ్యక్తి ఓ ఆలోచన చేస్తారు. దీని ప్రకారం నర్సు అతని చేతిపై టీకా వేసినట్టు చేస్తారు. తాను కూడా వ్యాక్సిన్ తీసుకున్నట్టు.. ఆ సమయంలో కాస్త నొప్పి వచ్చినట్టు ఆ వ్యక్తి నటిస్తారు. అనంతరం నాకేం కాలేదని నవ్వుతూ చెప్తారు. దీనితో ఆ చిన్నారి కూడా ధైర్యంగా టీకా వేయించుకుంటుంది. నవ్వుతూ టాటా చెపుతుంది. కాగా, ప్రస్తుత సమాజంలో మనకు ఇలాంటి తల్లితండ్రులే కావాలంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..