Guinness World Record: ఆయన కాళ్లు కాదు.. చేతులే గిన్నిస్ రికార్డును బద్దలు కొట్టాయి!
జియాన్ క్లార్క్ (23) అనే దివ్యాంగుడు చేతులతోనే వేగంగా పరిగెత్తి గిన్నిస్ రికార్డును సృష్టించారు
ఇంటర్నెట్ డెస్క్: పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ పరుగు పందెంలో రికార్డు బద్దలు కొట్టడం తెలుసు. కానీ, ఓ దివ్యాంగుడు చేతులపై వేగంగా పరుగెత్తి ఓ రికార్డును నెలకొల్పితే..! చేతులతో పరుగెత్తడం ఏంటని ఆలోచిస్తున్నారా? అవును.. జియాన్ క్లార్క్ (23) అనే దివ్యాంగుడు చేతులతోనే వేగంగా పరిగెత్తి గిన్నిస్ రికార్డును సృష్టించారు. అమెరికాకు చెందిన దివ్యాంగుడు జియాన్ క్లార్క్ గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో తాజాగా చోటు దక్కించుకున్నారు. చేతులపై 20 మీటర్ల దూరాన్ని కేవలం 4.78 సెకన్లలో చేరుకుని ఆయన ఈ ఘనత సాధించారు. అయితే, క్లార్క్ ఫిబ్రవరిలోనే ఈ రికార్డును సృష్టించగా.. గ్లోబల్ ఆర్గనైజేషన్ వారు తాజాగా గుర్తించి గిన్నిస్ రికార్డుల్లోకి చేర్చారు.
జియాన్ క్లార్క్ కాళ్లు లేకుండానే జన్మించారు. దీనికి కాడల్ రిగ్రెషన్ సిండ్రోమ్ కారణమని అమెరికా నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ తెలిపింది. దివ్యాంగుడిగా క్లార్క్ ఎప్పుడూ బాధపడలేదు. తన స్కూల్ డేస్లోనే రెజ్లర్గా రాణించారు. అంతేకాకుండా ఆయన ఇతరుల్లో స్ఫూర్తి నింపే ఒక వక్తగా, రచయితగా, ఎంటర్ప్రెన్యూర్గా ఎదిగి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కాగా.. క్లార్క్ చిన్నతనం నుంచి ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంటూ పెరిగారు. కానీ, ఆయన దేనికి వంకలు పెట్టకూడదనే నినాదంతో ముందుకు సాగారు. క్లార్క్ ప్రస్తుతం 2024లో జరిగే పారిస్ ఒలింపిక్స్పై దృష్టి సారించారు. ఆయన రెజ్లింగ్, వీల్ చేర్ రేసింగ్ (పారాలింపిక్స్)లో పోటీ చేసి అమెరికన్ అథ్లెట్గా ఎదగాలనుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా