రైతుల ఆదాయం రెట్టింపు కోసమే..సాగు చట్టాలు!
తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన విషయం ఏదైనా ఉందంటే అది కేవలం రైతుల ఆదాయం రెట్టింపు చేయడమేనని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా పునరుద్ఘాటన
బెంగళూరు: తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన విషయం ఏదైనా ఉందంటే అది కేవలం రైతుల ఆదాయం రెట్టింపు చేయడమేనని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలు రైతుల ఆదాయాన్ని అనేక రెట్లు పెంచుతుందని మరోసారి స్పష్టం చేశారు. కర్ణాటకలోని కేరకల్మట్టి గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అమిత్ షా ప్రసంగించారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి వ్యవసాయ రంగానికి బడ్జెట్ పెంచడంతో పాటు వివిధ రకాల పంటలకు కనీస మద్దతు ధరను పెంచామని అమిత్ షా వెల్లడించారు. అంతేకాకుండా రైతుల ప్రయోజనం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివిధ పథకాలను ఆయన ఉదహరించారు. ముఖ్యంగా రైతులకు ప్రయోజనకరమైన ఆర్థిక సాయం(కిసాన్ సమ్మాన్ యోజన), ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ..తదితర పథకాలను వివరించారు.
ఇదిలాఉంటే, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగుచట్టాలను వ్యతిరేకిస్తూ దిల్లీ సరిహద్దులో రైతులు నిరసన చేపడుతోన్న విషయం తెలిసిందే. ఓవైపు సాగు చట్టాలను రద్దు చేసే వరకు తమ పోరాటం ఆగదని రైతులు చెబుతుంటే.. వాటిని రద్దు చేసే ప్రసక్తే లేదని మరోవైపు కేంద్రం కూడా స్పష్టంచేస్తోంది. అయితే, రైతులకున్న అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని చట్టంలో మార్పులు చేసేందుకు సిద్ధమని ప్రకటిస్తోంది. ఇందులో భాగంగా, కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తొమ్మిది విడతల్లో రైతుల్లో చర్చలు జరిపింది. అయినప్పటికీ ఫలితం తేలలేదు. దీంతో మరోసారి చర్చలను కొనసాగించాలని ఇరు వర్గాలు నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చట్టాల అమలుపై స్టే విధించిన సుప్రీంకోర్టు..రైతుల సమస్యలను వినేందుకు ఓ కమిటీని వేసింది. అయితే, కమిటీ ముందుకు రావడానికి మాత్రం రైతు సంఘాల నేతలు నిరాకరిస్తున్నారు.
ఇవీ చదవండి..
సాగు చట్టాలపై సుప్రీం స్టే
ఆ ముగ్గుర్నీ తొలగించండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?