శతాబ్దాల కిందటి పరిమళాన్ని కనుగొంటారట!
గడిచిన కాలాన్ని తిరిగి వెనక్కి తీసుకురాలేం. చరిత్రను తిరగరాయలేం. కానీ, కొన్ని శతాబ్దాల కిందట ఏం జరిగింది?అప్పటి వ్యక్తుల జీవనం ఎలా ఉండేదనే విషయాలను చరిత్ర పుస్తకాల ద్వారా, సినిమాల ద్వారా తెలుసుకుంటున్నాం. కానీ, ఆ కాలంలో పరిమళం
ఇంటర్నెట్ డెస్క్: గడిచిన కాలాన్ని తిరిగి వెనక్కి తీసుకురాలేం. చరిత్రను తిరగరాయలేం. అయితే, కొన్ని శతాబ్దాల కిందట ఏం జరిగింది? అప్పటి వ్యక్తుల జీవనం ఎలా ఉండేదనే విషయాలను చరిత్ర పుస్తకాలు, సినిమాల ద్వారా తెలుసుకుంటున్నాం. కానీ, ఆ కాలంలో పరిమళం ఎలా ఉండేదో తెలుసా? అదేలా సాధ్యం.. గత కాలపు పరిమళం మనకెలా తెలుస్తుంది అంటారా? దాన్ని సాధ్యం చేయాలని పలువురు శాస్త్రవేత్తలు, చరిత్రకారులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఓ ప్రాజెక్టును చేపట్టారు.
అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రాచీన చరిత్ర గల ప్రాంతాల్లో ఐరోపా ఒకటి. చరిత్రకారులు యూరప్ చరిత్రను భద్రపరుస్తూ, భవిష్యత్తు తరాలకు తెలియజేస్తూ వస్తున్నారు. అయితే, తాజాగా శాస్త్రవేత్తలు, కృత్రిమ మేధ, పరిమళాల నిపుణులతో కలిసి ప్రాచీన కాలంలో యూరప్ వ్యాప్తంగా ఎలాంటి పరిమళం వచ్చేదో తెలుసుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం ‘ఒడురొపా’ పేరుతో ఓ ప్రాజెక్టు ప్రారంభించారు. చరిత్రను తెరిచి చూస్తే కాలంతోపాటు మనుషుల జీవన విధానం ఎంతో మారిపోయింది. ఒకప్పుడు వ్యవసాయం మాత్రమే ఉండేది.. ఆ తర్వాత పరిశ్రమలు, కంపెనీలు, ఇతరత్రా ఉపాధి అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలో సమాజంతోపాటు గాలిలోని పరిమళం కూడా మారుతూ వచ్చింది.
అలా 16వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం అర్ధభాగం వరకు యూరప్లోని వివిధ ప్రాంతాల్లో ఎలాంటి పరిమళం ఉండేదో కనిపెట్టి ఇప్పటి ప్రజలకు తెలపాలన్నదే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ‘చరిత్రలోని ప్రతి దశకు ఓ ప్రత్యేకమైన పరిమళం ఉంది. వాటిని ప్రజలకు పరిచయం చేస్తే.. వారు చరిత్రను చూడటంతోపాటు అప్పటి పరిమళాన్ని ఆస్వాదించగలరని, అలాగే ప్రస్తుత కాల పరిమళాలపై ఆసక్తి పెరుగుతుందని’ ఒడురొపా బృందంలోని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు కోసం 2.8మిలియన్ యూరోలు(రూ.25కోట్లు) ఖర్చు చేస్తున్నారు. ఏడు భాషాల్లో ఉన్న యూరప్ సాహిత్యాన్ని తెలుసుకొని అందులో పరిమళాల గురించి ఉన్న సమాచారాన్ని కృత్రిమమేధ ద్వారా సేకరిస్తారట. కనిపెట్టిన పరిమళాలను మ్యూజియం ద్వారా ప్రజలు ఆస్వాదించేలా చేస్తామని నిపుణులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!
-
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ