స్వర్గసీమ మణిదీప్తులు... తులిప్ పువ్వులు
‘‘దేఖ ఏక్ ఖ్యాబ్ ఏ సిలిసిలే హువే...’’ అంటూ.. అమితాబ్, రేఖ పాడుకునే ఒకానొక ప్రేమగీతం వెనుక తివాచీలా కనువిందు చేసే తులిప్ల గురించి తెలిసింది చాలా
అందాలకి తరగని గనులు...
‘‘దేఖ ఏక్ ఖ్యాబ్ ఏ సిలిసిలే హువే...’’ అంటూ.. అమితాబ్, రేఖ పాడుకునే ఒకానొక ప్రేమగీతం వెనుక తివాచీలా కనువిందు చేసే తులిప్ల గురించి తెలిసింది చాలా కొద్దిమందికే. తులిప్ అంటే లాటిన్ భాషలో తలపాగా అని అర్థం. చూడగానే అందంగానే కాదు ఆహ్లాదాన్ని కలిగించే ఈ పూలు తలలో పెట్టుకోవడానికి పనికిరావు. కానీ, గృహ అలంకరణలో మాత్రం రాజసాన్ని చూపిస్తాయి. అందమైన ఈ తులిప్ పుష్పాలకు ఎన్నో ప్రత్యేకతలున్నాయ్..
* మూడు రేకలతో అరవిరిసినట్టు ఉండే ఈ మొగ్గలకే గిరాకీ ఎక్కువ. చల్లగా, తేమగా ఉండే నేలలే తులిప్ సాగుకి అనువైనవట.వేడి ప్రాంతాల్లో అయితే వసంతకాలం పూతకి అనుకూల సమయం.
* సాధారణంగా దుంపల నుంచి వచ్చిన మొక్కలు ఏడాదిలోపే పూస్తాయి. విత్తనాల ద్వారా అయితే పూతకొచ్చేసరికి దాదాపు నాలుగైదేళ్లు పడుతుంది. అందుకే రైతులు తులిప్ సాగుకి ఎక్కువగా దుంపలనే ఎంచుకుంటారు.
* పదో శతాబ్దం నాటికే వీటిని టర్కీలో సాగుచేశారని, తర్వాత ఐరోపా, ఉత్తర ఆఫ్రికా, ఆసియాలోని అనతోలియా, ఇరాన్, ఇరాక్, చైనా వంటి దేశాలకి విస్తరించాయని శాస్త్రవేత్తల మాట.
* తులిప్లలో భిన్నమైన రంగులు కలిగినవి పామిర్, హిందూకుష్ పర్వత ప్రాంతాలు, కజకిస్థాన్ గడ్డి మైదానాల్లో విరగబూస్తాయి.
* పదహారో శతాబ్దంలో నెదర్లాండ్స్లో తులిప్స్కి ఆదరణ పెరిగింది. నెదర్లాండ్, ఉత్తర అమెరికా దేశాల్లో తులిప్ పూల ఉత్సవాలు ఏటా మే మాసంలో నిర్వహిస్తారు.
* మనదేశంలో కశ్మీర్ రాజధాని శ్రీనగర్లో తులిప్లను సాగుచేస్తున్నారు. ఇక్కడ దాదాపుగా అరవై రకాల తులిప్లను చూడొచ్చు. ఇక్కడ ఏప్రిల్ మాసంలో జరిగే ఇందిరా - మహాత్మాగాంధీ తులిప్ ఉత్సవం దక్షిణాసియాలోనే అతిపెద్దది.
* తులిప్ పూల దుంపలు తియ్యగా ఉండటంతో ఎలుకలు, కుందేళ్లు, ఉడుతలు మట్టిని తవ్వి దుంపలను తినేస్తుంటాయి.
* తులిప్ పువ్వుల్లో అసలైనవి పదిరంగులే. మిగతావన్నీ కృత్రిమ జాతులే.
* తులిప్లకు మెజాయిక్ అనే వైరస్ సోకుతుంది. దీని ప్రభావం వల్ల పువ్వుల సహజ రంగులపై వేరే పూల రంగుల గీతలు రావడం వల్ల వీటి అందం ఇనుమడించడంతో పాటు గిరాకీ కూడా పెరగడంలో కృత్రిమ జాతులను సాగులోకి తెచ్చారు.
* సాధారణంగా తులిప్ పూలను బహుమతిగా ఇచ్చేందుకు ఎంచుకుంటారు. తెలుపు రంగు తులిప్ స్వచ్ఛతకి, ఎరుపు సిసలైన ప్రేమ, గులాబీ రంగు తులిప్ను అభినందనకి, ఆరెంజ్ తులిప్ శక్తి, కోరికను తెలియజేసేందకు, నీలం ప్రశాంతతకి చిహ్నంగా ఎంచుకుంటారు.
* హంగేరీ, కజకిస్థాన్, నెదర్లాండ్స్, టర్కీ వంటి దేశాలు తమ జాతీయ పుష్పంగా తులిప్ను ఎన్నుకున్నాయంటే ఈ తులిప్ల ఆకర్షణ, ప్రభావం ఎంత శక్తిమంతమైందో కదా!
- కన్నీడి మనోహర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
జెన్కోలో అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ), కెమిస్ట్ ఉద్యోగాల నియామక రాత పరీక్ష వాయిదా పడింది. -
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM