chittoor: చిత్తూరు జిల్లాలో వరద బీభత్సం: కొట్టుకుపోయిన నలుగురు మహిళలు
భారీ వర్షాలతో చిత్తూరు జిల్లా అతాకుతలం అవుతోంది. జిల్లాలోని బలిజపల్లి చెరువు వద్ద కాజ్వేపై నలుగురు మహిళలు వరదలో కొట్టుకుపోయారు.
చిత్తూరు: భారీ వర్షాలతో చిత్తూరు జిల్లా అతాకుతలం అవుతోంది. ఎటుచూసినా వరదలతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. బలిజపల్లి చెరువు వద్ద కాజ్వేపై నలుగురు మహిళలు వరదలో కొట్టుకుపోయారు. గల్లంతైన వారిని జయంతి, కస్తూరి, ఉషారాణి, లక్ష్మీదేవిగా గుర్తించారు. వీరు బంగారుపాళ్యం మండలం టేకుమండ వాసులుగా గుర్తించారు. గల్లంతైన వారికోసం అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
50 మంది రోగులు స్విమ్స్కు తరలింపు
మరోవైపు తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో వైద్యసేవలు ఆగిపోయాయి. ఆసుపత్రి విద్యుత్ మీటర్లు వరద నీటిలో మునిగిపోయాయి. 50 మంది రోగులను అధికారులు స్విమ్స్కు తరలించారు. విద్యుత్ పునరుద్ధరించే వరకు రోగులు ఆసుపత్రికి రావద్దని సూపరింటెండెంట్ సూచించారు.
భారీ వరదలతో మాల్వాడి గుండం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. సప్తగిరుల నుంచి వస్తున్న వరద నీటితో ఈ ప్రవాహం ఉద్ధృతమైంది. ఈ వరద ఉద్ధృతికి కపిలతీర్థం ఆలయంలో రెండు రాతి స్తంభాలు కూలాయి. వేణుగోపాలస్వామి ఆలయ ప్రధాన మండపంలో పైకప్పు, గోడ కూలాయి. మరోవైపు కడప-తిరుపతి జాతీయ రహదారిపై భారీ ఎత్తున వాహనాలు చిక్కుకున్నాయి. భారీ వర్షాలతో జాతీయ రహదారిపై వరద ప్రవాహం పెరిగింది. రహదారిపై కార్లు కూడా మునిగే స్థాయిలో వరద నీర చేరింది. బాలపల్లి, కుక్కలదొడ్డి మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. కడప-తిరుపతి మార్గంలో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!