​​​​​​Free Wi-fi: ఉచిత వైఫై @ 6000 స్టేషన్స్‌

భారతీయ రైల్వే మరో మైలురాయి అందుకుంది. డిజిటల్‌ ఇండియాలో భాగంగా ఏర్పాటు చేస్తున్న ఈ సేవలు ఇప్పటి వరకు ఆరువేల స్టేషన్లకు విస్తరించాయి. ఝార్ఖండ్‌లోని హజీర్‌బాగ్‌ స్టేషన్‌లో శనివారం ఈ సేవలను ప్రారంభించడం...

Published : 16 May 2021 17:12 IST

దిల్లీ: భారతీయ రైల్వే మరో మైలురాయి అందుకుంది. డిజిటల్‌ ఇండియాలో భాగంగా ఏర్పాటు చేస్తున్న ఈ సేవలు ఇప్పటి వరకు ఆరువేల స్టేషన్లకు విస్తరించాయి. ఝార్ఖండ్‌లోని హజీర్‌బాగ్‌ స్టేషన్‌లో శనివారం ఈ సేవలను ప్రారంభించడం ద్వారా భారతీయ రైల్వే ఈ మైలురాయిని చేరుకుంది.

ఫ్రీ వైఫై సేవలు తొలిసారి 2016లో ముంబయి రైల్వేస్టేషన్‌లో ప్రారంభమయ్యాయి. అనంతరం దేశంలోని ప్రధాన స్టేషన్లకు ఈ సేవలను విస్తరించారు. పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్‌ స్టేషన్‌ 5000వ స్టేషన్‌గా నిలిచింది. పట్టణ, గ్రామీణ అనే తేడా లేకుండా అందరికీ ఈ సేవలు అందించడమే లక్ష్యమని రైల్వే తెలిపింది. గూగుల్‌, డీవోటీ, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, టాటా ట్రస్ట్‌ సహకారంతో రైల్వే శాఖకు చెందిన రైల్‌టెల్‌  వీటిని ఉచితంగా ఏర్పాటు చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని