indian oil: ఇండియన్ ఆయిల్ ఇ-వోచర్.. సోషల్మీడియాలో ట్రోల్!
ఇటీవల చమురు ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ప్రభుత్వాలు సుంకం తగ్గించినా.. లీటర్ పెట్రోల్ రూ.100కి మించి తగ్గలేదు. దీంతో పెట్రో ధరల పెంపుపై చాలా మంది వినూత్న నిరసనలు తెలిపారు. కొన్నిచోట్ల వధువరులుకు 5 లీటర్ల పెట్రోల్ను బహుమతిగా ఇచ్చిన సందర్భాలూ కనిపించాయి. అయితే, ఆ బహుమతి
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల చమురు ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. కేంద్రం సుంకాలు తగ్గించినా.. లీటర్ పెట్రోల్ ధర రూ.100పైనే ఉంది.. దీంతో పెట్రో ధరల పెంపుపై చాలా మంది వినూత్న నిరసనలు తెలిపారు. కొన్నిచోట్ల వివాహ కార్యక్రమాల్లో వధువరులుకు 5 లీటర్ల పెట్రోల్ను బహుమతిగా ఇచ్చిన సందర్భాలూ కనిపించాయి. అయితే, ఆ బహుమతి కాన్సెప్ట్ను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సీరియస్గా తీసుకుంది. అధికారికంగా పెట్రోల్/డీజిల్ను ఇతరులకు బహుమతిగా ఇచ్చేలా ఇ-ఫ్యూయల్ వోచర్లను ప్రవేశపెట్టింది. శుభకార్యాల్లో నచ్చిన వ్యక్తులకు వీటిని బహుమతిగా ఇవ్వండంటూ సోషల్మీడియాలో ప్రచారం చేస్తోంది. గత దీపావళి, ధన్తేరస్ పర్వదినాల్లోనూ ఈ వోచర్లపై బాగా ప్రచారం చేసింది. వీటిని one4u.easyfuel.in వెబ్సైట్లో పొందొచ్చని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పేర్కొంది. వోచర్ ధర(పెట్రోల్/డీజిల్ విలువ) కనీసం.. రూ.500 కాగా.. గరిష్ఠంగా రూ.10వేలుగా ఉంది. అయితే, ఇండియన్ ఆయిల్ విక్రయిస్తున్న ఇ-ఫ్యూయల్ వోచర్ను నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు.
మీ స్నేహితుల వివాహానికి ఖరీదైన బహుమతి తీసుకెళ్లాలంటే ఈ ఇ-వోచర్ కొనుగోలు చేయండంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరో నెటిజన్.. పెట్రోల్కి ఇ-వోచర్ తీసుకొచ్చిన్నట్లే ప్రభుత్వం.. టమోటాలకు కూడా ఇ-వోచర్ తెస్తే బాగుంటుందని వ్యంగ్యంగా స్పందించాడు. మోదీ ప్రభుత్వం పెరిగిన చమురు ధరల్ని తగ్గించడం మానేసి.. ఆకాశనంటిన ధరలతోనూ మార్కెటింగ్ చేసుకుంటోందని మరొకరు విమర్శలు చేశారు.
► Read latest General News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే