తిరుపతి గరుడ వారధి పనుల్లో అపశ్రుతి
తిరుపతి స్మార్ట్ సిటీలో భాగంగా నిర్మిస్తున్న గరుడ వారధి నిర్మాణాలు కూలిపోయాయి. నగరంలోని తితిదే శ్రీనివాసం భక్తుల వసతి సముదాయం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిర్మాణాలు కూలడంతో రహదారిపై రాకపోకలు భారీగా అంతరాయం ఏర్పడింది.
తిరుపతి నగరపాలకం: తిరుపతి స్మార్ట్సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నగరంలో రూ.684 కోట్లతో నిర్మిస్తున్న గరుడ వారధి పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. తితిదేకు చెందిన శ్రీనివాసం భక్తుల వసతి గృహం సముదాయం వద్ద గరుడ వారధి డౌన్ర్యాంప్ పై ఏర్పాటు చేసిన సిమెంటు సెగ్మెంట్లు కిందికి జారిపోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. పెద్ద శబ్దాలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. నాలుగు రోజుల క్రితం రెండు స్తంభాల మధ్య ఈ సెగ్మెంట్లను ఏర్పాటు చేసిన గుత్తేదారు సంస్థ వాటిని స్తంభంపై నిలబెట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు సమాచారం. దీంతో సెగ్మెంట్లన్నీ కిందకు జారిపోయాయి.
జారిపోయిన సెగ్మెంట్లు శ్రీనివాసం వసతి గృహ ప్రహరీపై పడటంతో పెద్ద శబ్దం వచ్చింది. ఆ సమయంలో కార్మికులు ఎవరూ విధుల్లో లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం గానీ, గాయాలు గానీ కాలేదు. సంఘటన తెలుసుకున్న వెంటనే తిరుపతి నగరపాలక కమిషనర్ గిరీష, తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, అర్బన్ జిల్లా ఎస్పీ రమేష్ రెడ్డి అక్కడికి చేరుకుని ఘటనకు గల కారణాలను గుత్తేదారు సంస్థ ఆఫ్కాన్ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి విచారణ జరపనున్నట్లు వారు తెలిపారు. గరుడ వారధి సెగ్మెంట్ల కూలడంపై తెదేపా, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు అక్కడికి చేరుకుని అధికారుల నిర్లక్ష్యం వలనే ఇలా జరిగిందని ఆరోపించారు. గరుడ వారధి నిర్మాణం పనులపై సమగ్ర విచారణ జరపాలని డిమాండు చేశారు.
ఇదీ చదవండి
వాట్సాప్ ఐరోపాలో ఒకలా.. భారత్లో మరోలా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ