కలకలం రేపిన ఉత్తరాల సంచులు

మేడ్చల్‌ జిల్లా కీసర మండలం బండ్లగూడ రోడ్డు పక్కన ఉత్తరాల సంచులు నిర్లక్ష్యంగా పడి ఉండటం చర్చనీయాంశంగా మారింది. ప్రజాసాయి గార్డెన్‌ వద్ద వేలాది ఉత్తరాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Published : 05 Jan 2020 01:32 IST

కీసర: మేడ్చల్‌ జిల్లా కీసర మండలం బండ్లగూడ రోడ్డు పక్కన ఉత్తరాల సంచులు నిర్లక్ష్యంగా పడి ఉండటం చర్చనీయాంశంగా మారింది. ప్రజాసాయి గార్డెన్‌ వద్ద వేలాది ఉత్తరాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సంచుల్లో కూకట్‌పల్లి, షాద్‌నగర్‌, బాలానగర్‌, జగద్గిరిగుట్ట ప్రజల ఉత్తరాలు ఉన్నాయి. అందులో కొన్ని ఆధార్‌ కార్డులు, కాల్‌లెటర్లు ఉండటం గమనార్హం. తపాలా అధికారులే ఉత్తరాలను నిర్లక్ష్యంగా పడేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అందులో కాల్‌లెటర్లు ఉండటంతో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని