స్విమ్మింగ్పూల్లో కారు.. అసలేం జరిగిందంటే!
ఇటీవల స్విమ్మింగ్పూల్లో కారు మునిగిన దృశ్యానికి సంబంధించి కొన్ని ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఇంతకీ ఆ కారు నీటిలోకి ఎలా వచ్చింది.. ఎందుకు వచ్చిందని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
ఇంటర్నెట్డెస్క్: ఇటీవల స్విమ్మింగ్పూల్లో కారు మునిగిన దృశ్యానికి సంబంధించి కొన్ని ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఇంతకీ ఆ కారు నీటిలోకి ఎలా వచ్చింది.. ఎందుకు వచ్చిందని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. యూఎస్లోని ఫ్లోరిడా వెస్ట్ పామ్ బీచ్ పోలీసులు ఈ ఫొటోలను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక యువతి ఇటీవల కారులో ఫ్లోరిడాలోని ఓ హోటల్కు వచ్చింది. ఆమె కారు నడుపుతూ అక్కడికి వచ్చినపుడు అకస్మాత్తుగా దానిపై నియంత్రణ కోల్పోయింది. ఈ క్రమంలో కారు అక్కడే ఉన్న స్విమ్మింగ్పూల్లోకి దూసుకెళ్లి అందులో పడి మునిగిపోయింది. వెంటనే ఆమె కారు వెనక భాగం నుంచి డోర్ తెరుచుకుని బయటపడడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన చిత్రాలు అందరినీ ఆకర్షిస్తుండటంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ‘కార్ పూలింగ్’ అంటూ ఒకరు.. ‘ఈ రోజుల్లో కారు డ్రైవర్లకు కూడా స్విమ్సూట్ కావాలంటూ’ మరొకరు ఇలా నెటిజన్లు రకరకాలుగా చమత్కరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు