తుపాను ఎఫెక్ట్.. విమానం రికార్డు..!
యూకేలోని భయంకరమైన తుఫానును సైతం అనుకూలంగా మార్చుకున్న ఓ బ్రిటీష్ ఎయిర్వేస్ విమానం సరికొత్త రికార్డు నెలకొల్పింది. తుఫాను గాలులను ఉపయోగించుకుని న్యూయార్క్ నుంచి లండన్కు 4 గంటల 56 నిమిషాల్లోనే వేగంగా ప్రయాణించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
లండన్: యూకేలోని భయంకరమైన తుపాను గాలులను అనుకూలంగా మార్చుకున్న ఓ బ్రిటీష్ ఎయిర్వేస్ విమానం సరికొత్త రికార్డు నెలకొల్పింది. న్యూయార్క్ నుంచి లండన్కు ( 5,585 km) దూరాన్ని 4 గంటల 56 నిమిషాల్లోనే వేగంగా ప్రయాణించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆన్లైన్ విమాన ట్రాకింగ్ సర్వీస్ ద్వారా తెలిసిన వివరాల ప్రకారం.. బ్రిటీష్ ఎయిర్వేస్కు చెందిన బోయింగ్ 747 విమానం శనివారం సాయంత్రం న్యూయార్క్లోని జేఎఫ్కే విమానాశ్రయం నుంచి బయలుదేరింది. గాల్లోకి ఎగిరిన అనంతరం ఆ విమానం యూకేలోని ‘సియారా’ తుపాను గాలుల్ని అనుకూలంగా మలచుకుని కేవలం 4గంటల 56 నిమిషాల్లో లండన్ విమానాశ్రయాన్ని చేరుకుంది. గతంలో నార్వే ఎయిర్లైన్స్కు చెందిన విమానం ఈ మార్గాన్ని 5.13 గంటల్లోనే పూర్తి చేసి రికార్డు నెలకొల్పగా... ప్రస్తుతం బ్రిటీష్ ఎయిర్వేస్ విమానం దాన్ని బ్రేక్ చేసినట్లయింది. బ్రిటీష్ ఎయిర్వేస్ చేరుకున్న కొద్ది క్షణాలకే వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్బస్ ఏ350 కూడా చేరుకుంది.
ఏదేమైనప్పటికీ ఈ తుపాను ఎదురుగాలుల ప్రభావం వల్ల యూఎస్కు వెళ్లే విమానాలు రెండున్నర గంటలు ఆలస్యంగా అవుతున్నాయి. మరోవైపు యూకేలో ‘సియారా’ తుపాను ప్రభావంపై వాతావరణ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినట్లు అక్కడి వార్తా పత్రికలు ప్రచురించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్