తండ్రీ, కుమారులను కలిపిన టిక్‌టాక్‌

ఆరేళ్ల కిందట విడిపోయిన తండ్రీ, కుమారుడిని టిక్‌టాక్‌ కలిపింది..

Updated : 03 Mar 2020 22:02 IST

కర్నూలు: ఆరేళ్ల కింద విడిపోయిన తండ్రీ, కుమారుడిని సామాజిక మాధ్యమాల్లోని ఒకటైన టిక్‌టాక్‌ కలిపింది. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన పుల్లయ్య అనే వ్యక్తి ఆరేళ్ల క్రితం ఇళ్లు వదిలి గుజరాత్‌ వెళ్లి పోయాడు. పుల్లయ్య కుమారుడు నరసింహుడు తండ్రి గురించి వివరిస్తూ ఓ టిక్‌టాక్‌ వీడియో చేశాడు. కుమారుడి వీడియో చూసి చలించిన పుల్లయ్య తన వివరాలను ప్రస్తావిస్తూ టిక్‌టాక్‌ వీడియో చేసి పంపించాడు. తండ్రి  కోసం నరసింహుడు గుజరాత్‌ వెళ్లి పుల్లయ్యను కలుసుకున్నాడు. 

 

 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని