ఆ IAS, IPSలపై ఏపీ సర్కార్‌ ఆగ్రహం

వారాంతాల్లో విజయవాడ విడిచి వెళ్తున్న ఐఏఎస్‌, ఐపీఎస్‌లపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తంచేసింది. కొందరు సీనియర్లు హైదరాబాద్‌, దిల్లీలో

Updated : 24 Dec 2022 15:15 IST

అమరావతి: వారాంతాల్లో విజయవాడ విడిచి వెళ్తున్న ఐఏఎస్‌, ఐపీఎస్‌లపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తంచేసింది. కొందరు సీనియర్లు హైదరాబాద్‌, దిల్లీలో నివాసం ఉండటంపై అసంతృప్తి వ్యక్తంచేసింది. అధికారిక కార్యక్రమాలకు మినహా ఇతర ప్రాంతాలకు వెళ్లొద్దంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శనివారం మెమో జారీ చేశారు. కొందరు అధికారులు సచివాలయానికి సైతం హాజరు కాకపోవడంతో పాటు క్యాంపు కార్యాలయాల నుంచే విధులు నిర్వహిస్తుండటంపై సీఎస్‌ అసహనం వ్యక్తంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని