బడ్జెట్‌ పద్దులకు శాసనసభ ఆమోదం

తెలంగాణ శాసనసభ సమావేశాల్లో భాగంగా బడ్జెట్‌ పద్దులపై చర్చలు పూర్తయ్యాయి. మొత్తం 25 పద్దులపై శాసనసభలో చర్చ జరిగింది. ఈ చర్చలో 25 మంది శాసనసభ్యులు పాల్గొన్నారు. పద్దులపై చర్చకు 10 మంది మంత్రులు సమాధానం ఇచ్చారు. విద్య, క్రీడలు,

Updated : 15 Mar 2020 23:51 IST

హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ సమావేశాల్లో భాగంగా బడ్జెట్‌ పద్దులపై చర్చలు పూర్తయ్యాయి. మొత్తం 25 పద్దులపై శాసనసభలో చర్చ జరిగింది. ఈ చర్చలో 25 మంది శాసనసభ్యులు పాల్గొన్నారు. పద్దులపై చర్చకు 10 మంది మంత్రులు సమాధానం ఇచ్చారు. విద్య, క్రీడలు, పర్యాటకం, కార్మిక, దేవాదాయ, అటవీ, న్యాయ, పరిశ్రమలు, ఐటీ, పురపాలక, నీటిపారుదల, సాధారణ పరిపాలన, పంచాయతీరాజ్‌, ఆర్‌ ఆండ్‌ బీ, శాసనసభ, ఇందన, ఆర్థిక నిర్వహణ పద్దులకు ఆమోదం లభించింది. 

ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు శాసనసభలో 2019-20 సంవత్సరానికి అనుబంధ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దీంతో అనుబంధ బడ్జెట్‌కు శాసన సభ ఆమోదం తెలిపింది.  

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని