మనం ఒక్కటేనని చాటిచెప్పాలి:రాజేంద్ర ప్రసాద్‌

మహమ్మారి కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ‘జనతా కర్ఫ్యూ’పిలుపును ప్రతి పౌరుడు పాటించాలని ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ కోరారు.

Published : 22 Mar 2020 01:46 IST


 

ఇంటర్కెట్‌ డెస్క్‌: మహమ్మారి కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ‘జనతా కర్ఫ్యూ’ పిలుపును ప్రతి పౌరుడు పాటించాలని ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ కోరారు. ఈ మేరకు ఓ వీడియో సందేశం విడుదల చేశారు. కాళ్లు, చేతులు కడుక్కోపోతే.. ఒక వ్యక్తిని ఇంట్లోకే రానివ్వని సంప్రదాయం భారత దేశానిది.. అలాంటిది కరోనా మహమ్మారిని రానిస్తామా అని సందేశంలో వ్యాఖ్యానించారు.  ప్రధాని మోదీ పిలుపు మేరకు ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎవరి వాళ్ల ఇళ్లలో వారు ఉంటూ వీలైనంత పరిశుభ్రత పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మనమంతా ఒక్కటేనని చాటిచెప్పడానికి ఆదివారం సాయంత్రం 5 గంటలకు చప్పట్లతో హర్షాతిరేకాలు తెలపాలని ప్రజలను రాజేంద్రప్రసాద్‌ కోరారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని