ఇళ్లలోనే జనం..రోడ్లన్నీ ఖాళీ
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపుమేరకు దేశ వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో జనతా కర్ఫ్యూను విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకోవడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసర సేవలు
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపుమేరకు దేశ వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో జనతా కర్ఫ్యూను విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకోవడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసర సేవలు మినహా అన్ని సేవలు బంద్ అయ్యాయి. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించడంతో రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా పరిమిత సంఖ్యలో రైళ్లు నడుస్తున్నాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దుకాణాలు, షాపింగ్ మాల్స్, థియేటర్లు మూసివేసి స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూకు మద్దతు తెలుపుతున్నారు.
జనతా కర్ఫ్యూను విజయవంతం చేద్దాం: మోదీ
‘‘కరోనాపై పోరాటానికి జనతా కర్ఫ్యూ పాటించాలి. కర్ఫ్యూను విజయవంతం చేద్దాం. ఇంట్లో ఉండి ఆరోగ్యంగా ఉండండి. ఇప్పుడు మనం తీసుకునే చర్యలు భవిష్యత్కు ఉపయోగపడాలి’’ అని ప్రధాని మోదీ కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో..
జనతా కర్ఫ్యూకు తెలుగు రాష్ట్రాల ప్రజలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వైద్యం, మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల, అగ్నిమాపక శాఖ, ఆసుపత్రులు, పాలు, పండ్లు, కూరగాయలు, పెట్రోలు బంకులు, మీడియా సిబ్బందికి కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఆంధప్రదేశ్లో పెట్రోల్ బంకులు కూడా మూసివేశారు. తెలంగాణ సరిహద్దులో చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా 14 గంటలు కర్ఫ్యూ కొనసాగనుండగా, తెలంగాణలో ఇవాళ ఉదయం 6గంటల నుంచి సోమవారం ఉదయం 6గంటల వరకు కొనసాగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు